ఇస్తాంబుల్: సిరియాలో ఉగ్రవాదులు సాగిస్తున్న ఆగడాలకు ఆ దేశానికి చెందిన వేలాదిమంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే అదే సిరియాలో ఓ మహిళ ఉగ్రవాదులను ఎదిరించి ఓ మోడల్ స్కూల్ నడపడమే కాదు.. వారి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ స్నాతకోత్సవాన్ని కూడా నిర్వహించి, వార్తల్లో నిలిచింది. రానియా కిసార్... సిరియన్–అమెరికన్ మహిళ. అల్ఖైదా ఉగ్రవాద సంస్థ పెత్తనమున్న ఆ ప్రాంతంలో ఏ పనిచేయాలన్నా వారి అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. అయితే వారిని ఎదిరించి, పాఠశాలను ప్రారంభించిన కిసార్కు.. ఎన్నోసార్లు ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు ఎదురయ్యాయి. అయితే ఆమె ఏమాత్రం బెదరకుండా తనపని తాను చేసుకుపోయింది.
తాజాగా.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులతో స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుసుకున్న మిలిటెంట్లు మరోసారి కిసార్ను బెదిరించారు. స్నాతకోత్సవం జరుపుకొంటే తమకేమీ అభ్యంతరం లేదుకానీ.. వేడుకలో ఎటువంటి ఆటపాటల వంటివి ఉండకూడదని హెచ్చరించారు. అయినా అవేవీ లెక్కచేయని కిసార్.. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. విద్యార్థులు ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి.. పట్టాను, ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న సమయంలో స్వయంగా తానే గొంతువిప్పింది.
స్నాతకోత్సవం సమయంలో అమెరికా వర్సిటీల్లో పాడే గీతాన్ని ఆలపించింది. ఈ కార్యక్రమానికి ఉగ్రవాదుల కూడా హాజరైనా ఏమీ చేయలేకపోయారు. కార్యక్రమం అనంతరం కిసార్ మాట్లాడుతూ... ‘వాళ్లు వారి పెత్తనాన్ని చాటుకోవాలని ప్రయత్నించారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే నేను చేస్తున్నది తప్పు కాదు. అటువంటప్పుడు నేనెవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేద’ని పేర్కొంది.
ఉగ్రవాదులను ఎదిరించి స్నాతకోత్సవం
Published Mon, Jul 17 2017 11:03 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement