కేరళకు సాయం ప్రకటించిన రాష్ట్రాలు... | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 18 2018 8:10 PM

Various State Government Donations For Kerala Flood Relief Fund - Sakshi

తిరువనంతపురం : వరద బీభత్సంతో చిగురుటాకులా వణికిపోతున్న కేరళకు అండగా నిలిచేందుకు దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 25 కోట్లు,  ఢిల్లీ ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతు సాయం ప్రకటించాయి.

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఆర్థిక సాయం..
ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం- 15 కోట్ల రూపాయలు
బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌- 10 కోట్ల రూపాయలు
హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌- 10 కోట్ల రూపాయలు
ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌- 5 కోట్ల రూపాయలు
జార్ఖండ్‌ సీఎం రఘుబర్‌దాస్‌ - 5 కోట్ల రూపాయలు
హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం- 5 కోట్ల రూపాయలు
గుజరాత్‌ ప్రభుత్వం- 10 కోట్ల రూపాయలు
తమిళనాడు ప్రభుత్వం- 5 కోట్ల రూపాయలు
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం- 5 కోట్ల రూపాయలు

Advertisement

తప్పక చదవండి

Advertisement