న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంలో కూరుకుపోయిన తమ మహిళానేతలను సమర్థిస్తూ వస్తోన్న బీజేపీ అధిష్ఠానం తాజాగా తన పంథాను మార్చుకుందా? ఆధారాలతో సహా దొరికిపోయిన నాయకురాళ్లపై చర్యలకు ఉపక్రమిస్తుందా? అంటే అవుననే సమాధానాలు వినిపస్తున్నాయి.
శనివారం ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. విజ్క్షాన్ భవన్లో ఏర్పటుచేసిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు జైపూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఢిల్లీకి వచ్చిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే.. సమావేశం అనంతరం బీజేపీ పెద్దలెవ్వరినీ కలుసుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. నిజానికి ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుస్తారని అంతా భావించారు. అయితే రాజేకు మోదీ, షాల అపాంయింట్మెంట్ ఖరారయిందీ లేనిదీ ఆ పార్టీ నేతలెవ్వరూ పెదవి విప్పడంలేదు.
ఇదే వివాదానికి సంబంధించి అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీలు బుధవారం ప్రధాని మోదీతో సమాలోచనలు జరిపి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఇంగ్లాండ్కు వెళ్లేందుకు రాజే సహాయం చేశారనే విషయం వెలుగులోకి రావడంతో విపక్షాలన్నీ ఆమె రాజీనామాకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
రాజెకు ముఖంచాటేసిన బీజేపీ పెద్దలు !
Published Sat, Jun 27 2015 4:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement