చంపేసి.. దేవుడి రాతంటారా? | Sakshi
Sakshi News home page

చంపేసి.. దేవుడి రాతంటారా?

Published Sat, May 2 2015 1:11 PM

చంపేసి.. దేవుడి రాతంటారా?

మోగా ఘటనపై  నోరుపారేసుకున్న పంజాబ్ రాష్ట్ర మంత్రిపై మృతురాలి కుటుంభ్యులు మండిపడ్డారు. లైంగిక వేధింపులకు పాల్పడి, బస్సులో నుంచి నెట్టేసి మా బిడ్డను చంపేశారు. దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించాల్సిందిపోయి.. ఇష్టానుసారంగా మాట్లాడతారా? అని ఆగ్రహించారు. హత్యచేసి దేవుడు ఇంతే ఆయుష్షు ఇచ్చాడని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  న్యాయం జరగకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చసుకుంటామని తేల్చిచెప్పారు. న్యాయం జరిగేవరకు బాలికకు దహనసంస్కారాలు నిర్వహించబోమన్నారు.

పంజాబ్ లోని మోఘ వద్ద ఏప్రిల్ 29న బస్సులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లను లైంగికంగా వేధించి బయటకు తోసేసిన ఘటనపై స్పందిస్తూ 'అమ్మాయి తలరాత దేడుడు అలానే రాశాడు. అందువల్లే చనిపోయింది' అని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సుర్జీత్ సింగ్ రఖ్రా వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. అకాలీదళ్ నేతలు ఈ ఉదంతాన్ని ప్రమాదంగా భావించాలన్నారు. దీంతో రాజకీయ పక్షాలన్నీ అకాలీదళ్ మంత్రులు, నాయకులపై విరుచుకుపడ్డాయి.

Advertisement
Advertisement