కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం రైతుసంఘాల ప్రతినిధుల వెల్లడి
న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో తమ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని.. పలు రైతుసంఘాలు, సంస్థల ప్రతినిధుల బృందం వెల్లడించింది. ఈ బృందం శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను ఆయన నివాసంలో కలిసింది. ఈ భేటీలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్సింగ్లు కూడా పాల్గొన్నారు. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ చట్టానికి పలు సవరణలు చేస్తూ గత ఏడాది డిసెంబర్ 29న జారీ చేసిన ఆర్డినెన్స్పై ప్రతిపక్ష పార్టీలతో పాటు.. ఆర్ఎస్ఎస్కు చెందిన రైతు విభాగంతో సహా వివిధ రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండడం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంటులో చట్టం చేసేందుకు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం బిల్లు తేనుంది.ముసాయిదా బిల్లులో.. ఆర్డినెన్స్లో భూసేకరణ చట్టంలో చేసిన సవరణలన్నీ యథాతథంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే.. పార్లమెంటు లోపలా, వెలుపలా ఎన్డీఏయేతర పక్షాలన్నీ భూసేకరణ ఆర్డినెన్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, పలు సామాజిక సంస్థలు, కార్యకర్తలు దీనిపై ఉద్యమించటానికి నిర్ణయం తీసుకోవటం వంటి పరిస్థితుల నేపధ్యంలో.. కేంద్ర మంత్రులు వివిధ రైతుసంఘాల నేతలతో సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీ అనంతరం భారతీయ కిసాన్ యూనియన్ నేత యుధ్వీర్సింగ్ తదితరులు మాట్లాడుతూ.. ఆర్డినెన్స్ను తొందరపాటుగా తెచ్చారని, రైతుల ప్రయోజనాలను విస్మరించారని తాము వ్యక్తంచేసిన ఆందోళనలు, అభ్యంతరాలను మంత్రులు సావధానంగా విన్నారని చెప్పారు. వారి నుంచి తమకు సానుకూల సంకేతాలు వచ్చాయని.. తమ ఆందోళలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
భూ ఆర్డినెన్స్పై ఆందోళనలను పరిశీలిస్తామన్నారు
Published Sun, Feb 22 2015 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement