జోధ్పూర్: ఓ గుర్రపు బంగీని తోలుకుంటూ ఓ కుర్రాడు వేగంగా దూసుకుపోవడం, ఓ మహిళ బెంచీ మీద కూర్చొని తాపీగా తేనీరు సేవిస్తుండడం, ఇంటి ప్రాంగణంలో ఓ బాలుడు బడలికతో పడుకొని ఉండడం, ఓ వీధి వాకిట గోడకు చేరగిలబడి కొంత మంది పెద్దవాళ్లు పిచ్చాపాటు మాట్లాడుకోవడం రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో మనకు నిత్యం కనిపించే దశ్యాలు. ఈ దశ్యాల అన్నింటివెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక్కటే కావడం విశేషం. అదే నీలి రంగు. నగరంలో ఎక్కడ చూసిన ఇళ్లకు, లోగిళ్లకు నీలి రంగే వేసి ఉంటుంది. జైపూర్ను పింక్ సిటీ అని పిలిచినట్లుగా జోధ్పూర్ ను బ్లూ సిటీ అని పిలవాల్సిందే.
15వ శతాబ్దంలో మహారాజా మాన్సింగ్ నగరంలో నిర్మించిన మెహ్రాన్గఢ్ కోట లోపల అద్దాలు కూడా నీలి రంగువే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఎక్కువ మంది తమ ఇళ్లకు నీలి రంగు వేస్తారు అన్న ప్రశ్నకు ఇక్కడు రెండు ప్రధాన కారణాలు చెబుతారు. నగరంలో నివసించే హిందూ అగ్రవర్ణాల్లో మెజారిటీలైన బ్రాహ్మణులు తమ ఇళ్లకు నీలి రంగు వేసుకునే ఆచారాన్ని మొదట ప్రారంభించారట. దొంగతనాల నుంచి తమ ఇళ్లను రక్షించుకోవడం కోసం బ్రాహ్మణలు ఈ చిట్కాను ఉపయోగించారట. ఎక్కువ మంది విద్యావేత్తలు, పూజారులు ఉండే బ్రాహ్మణులను గౌరవించాలని, వారి ఇళ్లను దోచుకుంటే పాపం చుట్టుకుంటుందన్న నమ్మకం అప్పట్లో ప్రజల్లో ఉండేదట. అందుకని దొంగలకు తమ ఇళ్లని తెలియడం కోసం బ్రాహ్మణులు ఇళ్లకు నీలి రంగు వాడేవారట.
ఒకప్పుడు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన ఈ రంగు రానురాను నగరమంతటా విస్తరిస్తూ పోయింది. ఇతర కమ్యూనిటీ ప్రజలు కూడా ఈ రంగును ఎక్కువ ఉపయోగించడం మొదలు పెట్టారు. గోడలకు, తలుపులకు నీలి రంగు వేయడం వల్ల పురుగు, పుట్ర రాదని, చెదలు పట్టవన్న విశ్వాసంతో వారు ఈ రంగు ఉపయోగిస్తున్నారట. నీలి రంగులో ఉండే కాపర్ సల్ఫేట్ వల్ల చెదలు రావని కొందరు చెబుతున్నారు. నీలి రంగు వల్ల సూర్య కిరణాలు పరావర్తనం చెందుతాయని, ఫలితంగా నీలి రంగు వేసుకుంటే ఇల్లు చల్లగా ఉంటుందని చదువుకున్న వారు చెబుతున్నారు.
ఆ నగరమంతా ‘బ్లూ’
Published Sat, May 7 2016 1:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement