సర్కార్ను నిలదీసిన కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దల్వాయి
ముంబై: ఎన్నికలకు ముందు మరాఠాలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్-ఎన్సీపీలు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో మరాఠాలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాణే కమిటీ చేసిన సిఫారసులపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేవలం మరాఠాలకు మాత్రమే రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తారు? ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు? అని కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దల్వాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఆయన ఆదివారం పత్రికాప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. కేవలం మరాఠాలకు మాత్రమే రిజర్వేషన్లను ఎందుకు వర్తింపజేస్తారు? ముస్లింలను ఎందుకు విస్మరిస్తారు? వారికి ఎందుకు ఇవ్వకూడదు? రాష్ట్రంలో ముస్లిం లు ఎంత దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారో తెలుసా? బాల కార్మికుల్లో 78 శాతం మంది ముస్లిం చిన్నారులే ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ముస్లింలు ఎందరు? పోలీసులు ముస్లింలను ఎందు కు వేధిస్తున్నారు? అని ప్రశ్నల వర్షం కురి పించారు. ‘రాజకీయ, ఉపాధి, ఆర్థిక రం గాలన్నీ 80-90 శాతం మరాఠాల అధీనంలోనే ఉంటున్నాయి. మరాఠాల్లో నిజంగా దుర్భర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వ పథకాలేవీ లబ్ధి చేకూర్చడంలేదు. రైతులు, భూమిలేని నిరుపేదలు, అసంఘటిత రంగంలోని కార్మికులు మరాఠాలైనా సరే వారికి ఎటువంటి ప్రయోజనం కలగడంలేదు. రిజ ర్వేషన్ల విషయంలో పేదరికాన్ని చూడాలి. ముస్లింలకు న్యాయం జరగాలంటే మరాఠాలతోపాటు వారికి కూడా రిజర్వేషన్లు అమలు చేయండ’ని దల్వాయి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మరాఠాలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లపై రాణే కమిటీ అధ్యయనం చేసింది. ప్రస్తుతం మండలి ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున 20వ తేదీ తర్వా త రిజర్వేషన్ల విషయమై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకుంటామని రాణే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముస్లింల నుంచి ఇప్పటిదాకా రిజర్వేషన్ల విషయమై ఎటువంటి డిమాండ్ రాలేదని రాణే సభలో చెప్పడంతో దల్వాయి వాదన ప్రాధాన్యత సంతరించుకుంది.
ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకివ్వరు?
Published Sun, Jun 15 2014 10:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- నీకు మొగుడు లేడా..? టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement