* శివసేన వైఖరిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చ
* 119 మించి ఇవ్వబోమని తేల్చిచెప్పిన శివసేన
* 135కి తగ్గమంటున్న బీజేపీ
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. 151 స్థానాలకు పోటీ చేసి తీరుతామని తెగేసి చెబుతున్న శివసేన.. బీజేపీకి 119కి సీట్లకు మించి ఒక్కటి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇదే తమ తుది మాట అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. 135 స్థానాలకు తక్కువగా పోటీ చేయవద్దని, అవసరమైతే ఒంటరిగా బరిలో దిగుదామన్న పార్టీ మహారాష్ట్ర శాఖ వాదనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులతో కూడిన కమిటీ చర్చించింది. అయితే, శివసేనతో పొత్తును వదులుకోవడంపై మోదీ, అమిత్షాలు అంత ఆసక్తి చూపలేదని సమాచారం.
సమావేశం మధ్యలో మోదీ, షాలు కాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారని, ఆ తరువాత అమిత్ షా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో మాట్లాడారని తెలిసింది. ఆ తరువాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలోనూ ఈ అంశంపై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. శివసేన మరి కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మెుత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నారుు. ఆదివారం ఉదయం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కార్యకర్తలతో మాట్లాడారు. ‘బీజేపీకి ఇంకెలాంటి రారుుతీ ఇవ్వదలుచుకోలేదు. ప్రతిపక్ష పార్టీల మహాయుతి (విపక్షాల మహా కూటమి) చెదిరిపోకుండా ఉండేందుకు నేనో చివరి ప్రయత్నం చేస్తున్నా.
119 సీట్లు బీజేపీకి వదిలి మనం 151 స్థానాల్లో బరిలోకి దిగుతాం. మిగతావి ఇతర మిత్రపక్షాలకు ఇస్తాం’ అని చెప్పారు. ‘2002 గుజరాత్ ఘర్షణల అనంతరం శివసేన దివంగత అధినేత బాల్ థాకరే మీకు వెన్నుదన్నుగా నిలిచిన విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి’ అంటూ ప్రధాని మోదీకి ఠాక్రే సూచించారు. గోధ్రా అల్లర్ల తర్వాత మోడీని గుజరాత్ సీఎం పదవి నుంచి తప్పించాలని అందరూ అన్నారని, అయితే హిందూ సిద్ధాంతం కోసం ఆయనను పదవిలో ఉంచాలని బాలసాహేబ్ ఒక్కరే అద్వానీకి నచ్చజెప్పారన్నారు. కూటమి కొనసాగాలన్నదే తన అభిమతమని, అన్ని సీట్లకు పోటీ చేసేందుకు సైతం తాము సిద్ధమని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే శివసేన తుది ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని మహారాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు.
ఢిల్లీకి ‘మహా’ పొత్తుల గొడవ
Published Mon, Sep 22 2014 3:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement