న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతామని ద్వారక పీఠాధిపతి, అధ్యాత్మిక మతగురువు సద్గురు స్వరూపానంద సరస్వతి శంకరాచార్య తెగేసి చెప్పారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిస్తే రాజకీయ మద్దతు లేకున్నా రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు ఇకనైనా రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడం ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మ సంసద్ ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో మెజారిటీ లేకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చట్టం తీసుకు రావడం సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.
మొఘల్ రాజు బాబర్ పేరుతో రాజకీయం చేయాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని శంకరాచార్య స్వరూపానంద మండిపడ్డారు. అయోధ్య హిందువుల పవిత్ర స్థలం అనే వాస్తవాన్ని ఆయన గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపైనా, ఎన్డీయే సర్కారుపైనా శంకరాచార్య విరుచుకుపడ్డారు.
'మీకు చేతులెత్తి నమస్కరిస్తా.. దయచేసి రామ జన్మభూమి గురించి మాట్లాడకండి. మేం అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తాం. దేవుడి దయ వల్ల రాజకీయ నాయకులు డబ్బులు మాకు అవసరం లేదు. దయచేసి ఈ చర్చను ఆపండి.. ప్రజలు, సాధువులు సహాయ సహకారాలతో మేము రామ మందిరాన్ని నిర్మిస్తాం' అన్నారు. నాయకుల్లో ఆధ్మాత్మిక పరిజ్ఞానం కొరవడిందని ఆగ్రహం ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ జపాన్ రాజుకు భగవద్గీతను బహుమతి ఇవ్వడానికి బదులుగా భారతదేశంలో పిల్లలకు గీతను ప్రబోధించే ఏర్పాటు చేసి ఉంటే తాను ఇంకా సంతోషించేవాడినని వ్యాఖ్యానించారు.
'అయోధ్యలో రామ మందిరాన్ని మేమే నిర్మిస్తాం'
Published Wed, May 13 2015 11:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement