వివాహితపై పది మంది అత్యాచారం! | Sakshi
Sakshi News home page

వివాహితపై పది మంది అత్యాచారం!

Published Sat, May 2 2015 9:38 PM

వివాహితపై పది మంది అత్యాచారం!

చెన్నై: తనను నమ్మి వచ్చిన ఓ మహిళపై ప్రియుడు పది మంది స్నేహితులతో అత్యాచారం చేయించిన దారుణం తమిళనాడులోని వేలూరు జిల్లాలో వెలుగుచూసింది. ఆర్కాడుకు చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహం కాగా, మనస్పర్థల వల్ల భర్తతో విడిపోయి రెండేళ్ల బిడ్డతో కలసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో ఒక యువకుడితో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారడంతో సహజీవనం సాగిస్తోంది.

 

అయితే, ఆ యువకుడు మహిళను శుక్రవారం కాట్పాడి సమీపం వల్లిమలై ప్రాంతానికి తీసుకెళ్లగా... అక్కడ అతని స్నేహితులు పదిమంది ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యారు. కాగా, తీవ్రగాయాలతో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో జరిగిన దారుణం వెలుగు చూసింది.

Advertisement
Advertisement