మహిళపై సామూహిక అత్యాచారం | Sakshi
Sakshi News home page

మహిళపై సామూహిక అత్యాచారం

Published Fri, Aug 22 2014 3:54 AM

woman gangraped in uttar pradesh

బరేలీ: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి బరేలీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ దళిత మహిళ(40)పై పది మంది మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త, కుమారునితో కలిసి బాధితురాలు పొలం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో పది మంది వీరిపై దాడి చేశారు. భర్త, కుమారుడిని తీవ్రంగా కొట్టి తాళ్లతో వారిని కట్టేసి.. బాధితురాలిపై అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు అత్యాచారానికి గురైనట్టు వైద్య నివేదికలో తేలిందని ఎస్‌పీ జె.రవీంద్రగౌడ్ తెలిపారు. 10 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement