చెన్నై : కామంతో కళ్లుమూసుకుపోయి తల్లీ బిడ్డలను హతమార్చిన మృగాడికి న్యాయస్థానం అదే స్థాయిలో కఠినమైన తీర్పును చెప్పింది. నిందితుడికి రెండుసార్లు ఉరిశిక్ష, ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. కోర్టు కథనం ప్రకారం, కోయంబత్తూరు గణపతి రామకృష్ణపురం రంగనాధన్ వీధికి చెందిన మరుదమాణిక్యంకు భార్య వత్సలాదేవీ (26) కుమారులు మగిళన్ (6), ప్రణీత్ (11నెలలు) ఉన్నారు. వీరి ఇంటిలో శివగంగై జిల్లా మానామధురైకి చెందిన సెంథిల్ (32) అద్దెకు ఉండగా, అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో యజమాని వత్సలాదేవీ అతడిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
గత ఏడాది జూన్ 1న సెంథిల్ వత్సలాదేవీ ఇంటికి వచ్చి అత్యాచార యత్నం చేశాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో విచక్షణా రహితంగా కత్తితో పలుచోట్ల పొడవడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఏమి జరుగుతోందో తెలియక బిత్తరపోయి చూస్తున్న ఆమె ఆరేళ్ల కుమారుడు మగిళన్ను, సమీపంలో ఏడుస్తున్న 11 నెలల పసికందు ప్రణీత్ను కత్తితో పొడిచి హతమార్చాడు. హతుల వద్దనున్న బంగారు వస్తువులను తీసుకుని పరారయ్యాడు. సెంథిల్ను కోయంబత్తూరు సమీపం సూలూరులో అరెస్ట్ చేశారు. గట్టి బందోబస్తు నడుమ నిందితుడు సెంథిల్ను మంగళవారం కోయంబత్తూరు కోర్టులో హాజరుపరిచారు. హతురాలి ఒంటిపై 54 చోట్ల, ఆమె కుమారులు ఆరేళ్ల చిన్నారి ఒంటిపై 21 చోట్ల, 11 నెలల పసికందుపై 11 కత్తిపోట్లు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి చెప్పారు.
భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠినమైన రీతిలో తీర్పు చెప్పబోతున్నట్లు న్యాయమూర్తి ముందుగానే ప్రకటించారు. తల్లిపై అత్యాచారం జరిపి హత్యచేసినందుకు యావజ్జీవం, తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులను దారుణంగా పొడిచి చంపినందుకు రెండుసార్లు ఉరిశిక్ష, వారి ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించారు. అంతేగాక ప్రతి కేసుకు రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో మరో మూడు నెలల జైలు శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
రెండు సార్లు ఉరి : మహిళా కోర్టు సంచలన తీర్పు
Published Tue, Mar 17 2015 10:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement