గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్న యోగీ | Sakshi
Sakshi News home page

గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్న యోగీ

Published Sat, May 13 2017 10:02 AM

Yogi Adityantha Gorakhnath Math Gaushala

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యానాథ్ శనివారం ఉదయం గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న గోశాలను  సందర్శించారు. గోవులకు ముఖ్యమంత్రి దాణా తినిపించారు. ఈ గోశాలలో  సుమారు 500 ఆవులు ఉన్నాయి.

ఈ సందర్భంగా గోశాల సంరక్షకుడు శివ్ పార్సెన్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి గోశాలను సందర్శించారని, బెల్లం, బిస్కెట్లు, పండ్లు, దాణాను గోవులకు తినిపించినట్లు తెలిపారు. అలాగే పలు గోవులకు ఆయన పేర్లు పెట్టారు. గతంలోనూ సీఎం యోగీ గోశాలను దర్శించిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement