ఆవుల స్మగ్లింగ్.. నిందితుల అరెస్ట్.. | Sakshi
Sakshi News home page

ఆవుల స్మగ్లింగ్.. నిందితుల అరెస్ట్..

Published Fri, Aug 19 2016 12:58 PM

ఆవుల స్మగ్లింగ్.. నిందితుల అరెస్ట్..

ముజఫర్ నగర్ః మాంసంకోసం గోవులను చంపేందుకు అక్రమంగా తరలిస్తున్న యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.  బుధానా నుంచి స్మగ్లింగ్ చేస్తున్న మూడు ఆవులను స్వాధీనం చేసుకొని, ట్రక్ యజమాని రాహుల్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ హెచ్ వో.. డీకే త్యాగి తెలిపారు. నిందితుడినుంచీ కొన్ని చాకులు, ఓ గొడ్డలి ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

బుధానానుంచి గురువారం రాత్రి  ఆవులతో ఆక్రమంగా తరలిపోతున్నట్లు అనుమానించిన  ట్రక్ ను అడ్డగించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. జలాలాబాద్ సమీపంలో ఆవుల విషయంలో తలెత్తిన వివాదంలో మాన్ సింగ్ అనే వ్యక్తి మెడను కోసి, హత్యకు యత్నించిన వ్యక్తితోపాటు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఇంకా ఆందోళన కరంగానే ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement