న్యూట్రీషియన్, రచయిత్రి రుజుతా దివాకర్
న్యూఢిల్లీ: మధుమేహం..రక్తపోటు.. ఊబకాయం.. ఇవి వంశపారంపర్యంగా వచ్చే జబ్బులని ఇప్పటివరకూ అనుకునేవారు..అయితే ఇప్పుడు అవి చాలా సాధారణ జబ్బులుగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. జీవితాల్లో వేగం, వ్యాయాయం లేకపోవడం, తినే తిండిపై నియంత్రణ లేకపోవడం, సరైన వేళకు నిద్రపోకపోవడం వల్ల ప్రస్తుత స్పీడ్ యుగంలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులతో టీనేజర్లు ఇబ్బందులు పడుతున్నారు.
యువత తమ శరీరంపై తగిన నియంత్రణ కోల్పోయిన తర్వాత ఫిట్నెస్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారని రచయిత్రి రుజుతా దివాకర్ తెలిపారు. ‘నేడు రోడ్లపైనా, సందుల్లోనా ఎక్కడిపడితే అక్కడ జిమ్లు, యోగా సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అయితే చాలా సెంటర్లలో శిక్షణ కోసం చేరి న వారికి గాయాలు తప్పితే సరైన ఫలితాలు పొందడంలేద’ని దివాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీనా కపూర్, ప్రీతి జింతా, అనిల్ అంబానీ వంటి హేమాహేమీలకు న్యూట్రీషియన్, ట్రయినర్గా రుజుతా సేవలందిస్తున్నారు. ఇటీవలనే ఆమె రాసిన ‘డోంట్ లాస్ అవుట్, వర్కవుట్’ అనే పుస్తకంలో వ్యాయామంపై పలువురికి ఉన్న అపోహ గురించి చర్చించా రు.
పలు సెంటర్లలో ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి ఇస్తున్న ఆహార సలహాలు వారిని మరింత నీరసంగా తయారుచేస్తున్నాయని వివరించారు. చాలా మంది యువకులకు తమ శరీరానికి ఎటువంటి వ్యాయామం సరిపోతుందో అవగాహన లేక లేని పోని ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారని ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. తమ జిమ్కు వచ్చిన వ్యక్తి శరీరతత్వానికి సరిపడా వ్యాయామాన్ని సూ చించడంలో జిమ్లో శిక్షకుడు అప్రమత్తుడై ఉండాల ని ఆమె సూచించారు.
‘చాలామంది ట్రైనర్లు తమ వద్దకు వచ్చిన యువకులకు కాలరీలను తగ్గించుకోవడానికి నీటిని తక్కువగా తాగాలని సూచిస్తున్నా రు. కాని అది మనిషి జీవక్రియపై ప్రభావముం టుందనే విషయం మరిచిపోతున్నార..’ని ఆమె పే ర్కొన్నారు.‘ఒక పురుషుడి శరీరంలో నీరు 55-60 శాతం ఉండాలి.. అయితే కొందరు శిక్షకులు తమ వద్దకు వచ్చిన క్లైయింట్ బరువు తగ్గించేందుకు తా త్కాలిక పద్ధతులను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా శరీరంలో నీటిశాతం తగ్గించేలా వారితో వ్యాయామం చేయిస్తున్నారు..దీంతో భవిష్యత్తులో వారు పలు అనారోగ్యాలకు కారణమయ్యే అవకాశముంది..’ అని ఆమె తెలిపారు.
వ్యాయామ కళపై అందరికీ అవగాహన పెరిగేలా కృషిచేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ‘సాధారణంగా ఎక్కువ చెమట పడితే శరీరంలో ఎక్కువ కాలరీలు ఖర్చు అవుతాయనేది కూడా ఒక అపోహే. చెమటపట్టడం అనేది శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియ.దాని వల్ల కాలరీలు ఖర్చు కావు..’ అని ఆమె వివరించారు. న డక మంచి వ్యాయామం పరుగు వలన మోకాళ్లు అరిగిపోతాయి.. కార్డియో వ్యాయామం వల్ల కాళ్లు, కీళ్లు బలపడతాయి.. పొట్ట తగ్గడానికి దానిపై ఒత్తిడి పెంచాలి..వంటికి కూడా మనలను వెంటాడుతున్న అపోహలేనని ఆమె తన పుస్తకంలో పొందుపరిచారు.
అపోహలతో అనారోగ్యం
Published Fri, Jun 6 2014 10:32 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement