గోదావరి మహా పుష్కరాల తొలిరోజే రాజమండ్రి లో జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధ్యు లెవరైనప్పటికీ ఇది మానవ వైఫల్యానికి చెల్లించాల్సి వచ్చిన మూల్యం. మన దేశంలో సామూహిక ఉత్స వాలెంత సుప్రసిద్ధమైనవో, సమూహ నిర్వ హణ వైఫల్యాలూ అంతే ఘనమైనవి. కనుకనే ఒకదాని వెంట మరో విషాదాన్ని లెక్కపెట్టు కుంటూ కూచోవాల్సిన దుస్థితి, క్షంతవ్యం గాని వైఫల్యాల నుంచి సైతం ఏమీ నేర్చుకో లేని ఉదాసీనత మన సంస్కృతిలో భాగంగా మారాయి. గోదావరి పుష్కరాల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే కనిపించింది. భారీగా నిధులనూ కేటాయించింది. సకల సౌకర్యాలూ, ఏర్పాట్లూ సమకూరుస్తున్నట్టే భరోసా కల్పించింది. ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా మన్నారు. విస్తృత ప్రచారంతో ప్రజలను ఆహ్వానిం చారు. ఏం లాభం? సమూహ నిర్వహణకు వచ్చేస రికి ఆదిలోనే ఘోర వైఫల్యం, మహా విషాదం ఎదుర య్యాయి. రాజమండ్రికి ఈ స్థాయిలో ప్రజలు తరలి వస్తారనేది ఊహించనిది కాదు.
వందల మంది చేరి తేనే తొక్కిసలాట, ప్రాణ నష్టం మనకు కొత్త కాదు. అలాంటప్పుడు లక్షల మంది గుమిగూడే సందర్భా నికి తగిన సన్నాహాలు, సంసిద్ధత ఏ స్థాయిలో ఉం డాలి? పుష్కర ఘాట్ల ప్రవేశ, నిర్గమన మార్గా ల్లో జనాల నియంత్రణకు తగిన ఏర్పాట్లు, మార్గనిర్దేశన ఉన్న దాఖలాలే లేవు. పైగా గం టల తరబడి తొక్కిసలాటలో నిలచిన భక్తులకు మంచినీటి వసతైనా కల్పించలేని అసమర్థతను ఏమనాలి? ఇంతటి ఘోర విషాదం తర్వాతైనా ప్రభు త్వం, అధికారయంత్రాంగం పాఠాలు నేర్చి మిగతా 11 రోజులైనా పుష్కరాలు సజావుగా సాగేలా సరైన చర్యలు చేపట్టాలి. భక్తుల ప్రాణాలు గాలిలో దీపా లుగా మారకూడదనుకుంటే ప్రభుత్వం తక్షణమే విప త్తు నిర్వహణ యంత్రాంగం సేవల్ని వినియోగించు కుని తగు చర్యలను చేపట్టాలి.
- డా॥డి.వి.జి. శంకరరావు
మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా
మహా పుష్కరం.. మహా విషాదం
Published Wed, Jul 15 2015 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement