పకడ్బందీగా సిద్ధం
సిరిసిల్ల/వేములవాడ: జిల్లాలో లోక్సభ ఎన్నికల ని ర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల జూ నియర్ కళాశాల, వేములవాడలోని జెడ్పీ స్కూల్లోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఆది వారం తరలివెళ్లారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యానాయక్ పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, ఈవీఎం కేటాయింపులను వేములవాడ, సిరిసిల్ల ఎన్నికల అధికారులు రాజేశ్వర్, రమేశ్ పర్యవేక్షించారు.
స్వేచ్ఛగా ఓటు వేయండి: కలెక్టర్
జిల్లా ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సిరిసిల్ల, వేములవాడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద చల్లని తాగునీరు, టెంట్లు, కూలర్లు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. దివ్యాంగుల కోసం ర్యాంప్లు, ట్రైసైకిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు, మన పోలీసు అధికారులతో భద్రత ఏర్పా టు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని, 50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు.
6 గంటల వరకు పోలింగ్
ఎండలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడగించిందని తెలిపారు. పోలింగ్ ముగిసిన త ర్వాత రిసెప్షన్ కేంద్రాల వద్ద పోలింగ్ సామగ్రిని సేకరించి కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలోని స్ట్రాంగ్రూమ్లకు తరలిస్తామని వివరించారు. ప్రలోభా లకు గురికాకుండా ప్రజలు ఆలోచించి ఓటు వేయా లని కోరారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ లైవ్ సెక్టార్ ఆఫీసర్ జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల వివరాలు పరిశీలించారు.
మోడల్ పోలింగ్ కేంద్రాలు ఇవే..
సిరిసిల్లలోని దివ్యాంగుల కోసం గీతానగర్స్కూల్, మహిళల కోసం గోపాల్నగర్ స్కూల్, మహిళా సంఘం భవనం శాంతినగర్లో మోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడ చింతలఠాణా, దివ్యాంగుల కోసం వేములవాడలో, యూత్ కోసం చందుర్తి మండలం ఎన్గల్, మహిళల కోసం మేడిపల్లి మండలం కల్వకోట, భీమారం మండలం దేశాయిపేట, వేములవాడరూరల్ మండలం జయవరం, వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి, కోనరావుపేట మండలం ఎక్లాస్పూర్ మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పటిష్ట బందోబస్తు
సిరిసిల్లక్రైం: ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక కేంద్ర బలగాల పహారా ఉంటుందని తెలిపారు. 57 రూట్ మొబైల్స్, 13 క్విక్ రియాక్షన్ టీమ్స్, 6 స్ట్రైకింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రైకింగ్టీమ్స్తోపాటు కేంద్ర బలగాలు, ట్రెయినీ కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారని తెలిపారు. ఇప్పటి వరకు రూ.82,11,362 నగదు సీజ్ చేయగా, 1,664.93 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు వివరించారు. గంజాయి 16 కేసులు నమోదుచేసి, 9.209 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. వివిధ కేసుల్లో 1,078 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 16 కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో 23 ఆయుధాలు డిపాజిట్ చేసినట్లు వివరించారు. జిల్లాలో ఎన్నికల స్వరూపంపోలింగ్ కేంద్రాలు 547
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 58
ఓటర్లు 4,72,735
మహిళలు 2,44,856
పురుషులు 2,27,840
థర్డ్ జెండర్ 39
పోలింగ్ సిబ్బంది 2,738
పోలింగ్రూట్లు 57
భద్రతకు పోలీస్ సిబ్బంది 1000
పోస్టల్ బ్యాలెట్లు 749 జిల్లాలో 547 పోలింగ్ కేంద్రాలు
4,72,735 మంది ఓటర్లు
2,738 మంది పోలింగ్ సిబ్బంది
స్వేచ్ఛగా ఓటేయండి
కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్మహాజన్