అవలోకనం
దూకుడుగా విస్తరించే స్వభావంగల సామ్రాజ్య రాజ్యం నెహ్రూకు వారసత్వంగా సంక్రమించింది. పైగా దాని సరిహద్దులు తాత్కాలికమైనవి. బ్రిటిష్ రాజ్ కాలం నాటి భారత్ అంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ భయపడేవి, అపనమ్మకంతో ఉండేవి. ఆ భయాన్ని, అపనమ్మకాన్ని అవి అధిగమించేలా చేయడంలోనూ, పరస్పర గౌరవం, ప్రయోజనాల ప్రాతిపదికపై నిలిచిన అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోవడంలోనూ మనం విఫలమయ్యాం. ఆ వైఫల్యమే బెల్ట్ అండ్ రోడ్ అంతర్జాతీయ సదస్సు విషయంలో మనల్ని ఏకాకులను చేసింది.
దాదాపు ముప్పయి ఏళ్ల క్రితం విశ్వనాథ్ ప్రతాప్సింగ్ ప్రధానమంత్రి అయినాక శ్రీలంక అధ్యక్షుడు రణసింగె ప్రేమదాసను కలుసుకున్నారు. సౌమ్యుడైన ప్రేమ దాస ‘‘మీరు మీ సైన్యాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకుంటారు?’’ అని కలిసిన వెంటనే ప్రశ్నించారు. దీంతో సింగ్ ఆశ్చర్యపోయారు. ప్రేమదాస ప్రస్తావించినది తమిళ టైగర్లతో పోరాడటం కోసం భారత సైన్యం శ్రీలంకకు పంపిన భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎఫ్) గురించి. భారత్ అప్పట్లో వేల కొలది జవాన్లను శ్రీలంకలో మోహరించింది. ఆ పోరాటాన్ని మనం లంక ప్రజల కోసం చేస్తున్న త్యాగంగా పరిగణించాం (ఆ పోరాటంలో మన వాళ్లు వెయ్యి మందికి పైగా మరణించారు). అయితే, ఒక దశ తర్వాత లంక ప్రజలు, దాన్ని తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంగా భావించారని, భారతీయులు తమ దేశాన్ని వదిలి వెళ్లాలని కోరుకున్నారని సింగ్ అభిప్రాయం.
ఆ అంతర్యుద్ధం సింహళ జాతీయవాదుల విజయంతో ముగిసింది. అయినా శ్రీలంకపై భారత్ ప్రభావం 30 ఏళ్ల క్రితం ఉన్నంతగా నేడు లేదు. శ్రీలంక ప్రజలలో ఎక్కువ మంది జోక్యందారుగా చూసే దేశం మరేదైనా ఉందంటే అది చైనా. కొలంబో, హంబన్తోటలలో చైనీయులు నిర్మిస్తున్న బ్రహ్మాండమైన ఓడ రేవులు భారత్ పోటీపడలేన ంతటి భారీ ప్రాజెక్టులు. అయితే, వాటితోపాటూ చైనా అభివృద్ధి నమూనా కూడా అక్కడికి దిగుమతి అవుతుంది. ఇంచుమించుగా అది మీ భూభాగంపై చైనా వలసలను అనుమతించడమని అర్థం. మీ తాహతుకు తగ్గ లేదా మించిన భారీ రుణాన్ని చైనా నుంచి తీసుకోవడం అని కూడా అర్థం.
చైనీయులు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలుచేస్తున్నారు. దాని పేరు ‘ఒన్ బెల్ట్ ఒన్ రోడ్’ (ఒకటే ఆర్థిక ప్రాంతం ఒకటే దారి). ‘బెల్ట్’ పలు ప్రధాన రహదారుల శ్రేణితో కూడినది కాగా, ‘రోడ్డు’ పలు ఓడ రేవులు, సముద్ర మార్గాలతో కూడినది. చైనా దీనిపై తన దృక్పథాన్ని వివరించడానికి మే నెలలో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశాన్ని భారత్ బహిష్కరించింది. అయితే, భూటాన్ తప్ప మన పొరుగు దేశాలన్నీ... శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్ అన్నీ హాజర య్యాయి.
ఇది, మనల్ని చుట్టుముట్టడం కావచ్చునేమోనని భారత వ్యూహాత్మక వ్యవహారాల గురించి యోచించే బృందంలో భయాలు సైతం తలెత్తాయి. చైనాతో భాగస్వామ్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆ సమావేశానికి హాజ రయ్యేవారందరినీ భారత్ హెచ్చరించింది. అయినా ఎవరూ మన మాట పట్టిం చుకోలేదు. ఎందుకు? అనేదే ప్రశ్న. దానికి జవాబు, ఈ వ్యాసంలోని అసలు విష యానికి, అంటే దాదాపు ఇరుగుపొరుగు దేశాలన్నీ భారత్ పట్ల విముఖంగా లేదా అనుమానాన్పద దృష్టితోఉన్నాయి అనే సమస్య వద్దకు తిరిగి వచ్చేట్టు చేస్తుంది.
హిందూ నేపాల్లో సైతం భారతీయుల పట్ల ప్రత్యేకమైన ఆదరణ ఏమీ లేదు. కెనడాతో అమెరికాకు ఉన్న అనుబంధం లాంటి సంబంధం ఉన్న పొరుగు దేశం మనకు ఒకటి కూడా లేదు. మన సరిహద్దులన్నీ అమెరికా, మెక్సికో సరి హద్దులలాగా లేదా అంతకంటే అధ్వానంగా ఉన్నట్టు అనిపిస్తాయి. బహుశా తప్పంతా పూర్తిగా పొరుగు దేశాలదే కావచ్చుననీ, మనం ఇతర దేశాల దుర్మా ర్గానికి గురవుతున్న బాధితులమనీ సగటు భారతీయుల అభిప్రాయం. పైగా పొరుగు దేశాల పట్ల మనకున్న పక్షపాత పూరితమైన దృక్పథం దీనికి తోడవు తుంది. బంగ్లాదేశీయులంటే అక్రమంగా వలస వచ్చినవారని, నేపాలీలంటే కావలిదార్లనీ, పాకిస్తానీలంటే ఉగ్రవాదులనీ మనం విశ్వసిస్తాం.
కొన్నేళ్ల క్రితం నేపాల్లో భారత వ్యతిరేక అల్లర్లు చెలరేగి, పలువురు మర ణించారు, ఆస్తి నష్టమూ సంభవించింది. నటుడు హృతిక్ రోషన్ నేపాలీలను ద్వేషిస్తానని అన్నాడనే వార్త అందుకు కారణం. రోషన్ అలాంటి మాటేమీ అన లేదు, ఆ వార్తే ఒక బూటకం. అసలు నేపాలీలు అలా వెంటనే దాన్ని నమ్మేయడం ఏమిటి? అనేదే మనం ప్రశ్నించుకోవాల్సింది. భారత్ నేడు తమ దేశాన్ని కొండ ప్రాంతాల ప్రజలు, మైదాన ప్రజలుగా విభజించడానికి ఎత్తులు వేస్తోందని, కొండ ప్రాంతాలవారికి వ్యతిరేకంగా సుదీర్ఘమైన, బాధాకరమైన దిగ్బంధనాన్ని ప్రేరేపిస్తోందని నేపాల్ ఉత్తర ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. తమ రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుంటోందని సైతం అనుకుంటున్నారు.
నేపాల్ విషయంలో భారత్కు సమంజసమైన బెంగలు, ప్రయోజనాలు ఉండటమూ సాధ్యమే. అయితే, ఒక హిందూ దేశాన్ని చైనాకు వ్యతిరేకంగా మనతో నిలుపుకోలేనంతగా నేపాల్తో మన సంబంధాలు ముక్క చెక్కలు ఎందుకు అయ్యాయి? చైనాకు వ్యతిరేకంగా మనతో ఉన్న మిత్రుడు ‘భూటాన్’ మాత్రమే. అయితే మన మధ్య సంబంధాలు ఇద్దరు సమానుల మధ్య ఉండేవి కావు. నెహ్రూ హయాంలోని భారత్, భూటాన్పై ‘మైత్రీ ఒప్పందాన్ని’ రుద్దింది. అది నిజానికి, భూటాన్ విదేశాంగ విధానాన్ని వీటో చేసే అధికారాన్ని భారత్కు కట్టబెట్టేది. సరిగ్గా చెప్పాలంటే ‘‘విదేశీ వ్యవహారాలకు సంబంధించి భారతదేశపు సలహాల మార్గదర్శకత్వాన్ని భూటాన్ అంగీకరిస్తుంది’’ అని అది పేర్కొంది. కొన్నేళ్ల క్రితం, బహుశా వాజ్పేయి హయాంలో గామోసు దాన్ని తొలగించారు.
దూకుడుగా విస్తరించే స్వభావంగల సామ్రాజ్య రాజ్యం నెహ్రూకు వార సత్వంగా సంక్రమించింది. పైగా దాని సరిహద్దులు తాత్కాలికమైనవి. బ్రిటిష్ రాజ్ కాలం నాటి భారత్ అంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ భయపడేవి, అపనమ్మకంతో ఉండేవి. ఆ భయాన్ని, అపనమ్మకాన్ని అవి అధిగమించేలా చేయ డంలో, పరస్పర గౌరవం, ప్రయోజనాల ప్రాతిపదికపై నిలిచిన అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోవడంలో మనం విఫలమయ్యాం. ఆ వైఫల్యమే బెల్ట్ అండ్ రోడ్ అంతర్జాతీయ సదస్సు విషయంలో మనల్ని ఏకాకులను చేసింది. మన పొరుగు దేశాలపై ఆర్థిక ప్రభావాన్ని నెరపగలగడంలో మన దేశం ఇంకా చాలా కాలంపాటూ చైనాకు సమ ఉజ్జీగా నిలవలేదు. అయితే అది, మనం ఆ దేశాలకు మంచి మిత్రులుగా కావడాన్ని నిలవరించలేదు.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com
ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత లేదు ఎందుకు?
Published Sun, May 28 2017 12:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement