బీజేపీ వంటి పార్టీకి మైనారిటీ ఓటు పడేటట్టు చేసిన ఘనతను మళీ ్ల ‘గోధ్రా అల్లర్లకు బాధ్యుడు’ మోడీకే ఇవ్వడం మరో విశేషం. అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు అంటూ మోడీ ఇచ్చిన పిలుపుతో ముస్లిం యువత ఆయనకే ఓటు వేసిందని సర్వే చెబుతోంది.
ఏ విధంగా చూసినా 2014 లోక్సభ ఎన్నికలు అనేక రకాల ప్రత్యేకతలతో చరిత్ర ప్రసిద్ధమైనాయి. మారిన ఉత్తర ప్రదేశ్ రాజకీయ చిత్రం కూడా అందులో ఒకటి. అక్కడి ఓటింగ్ సరళినీ, పాత పోకడలనీ ఈ ఎన్నికలు పరిపూర్ణంగా మార్చివేసిన సంగతి ఇప్పుడు జరుగుతున్న సర్వేలతో బయటపడుతోంది. ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్ ఊపందుకోవడం వెనుక ఉన్న కారణాలలో ఈ ‘మార్పు’కూడా ఒకటి కావచ్చు. కుల సమీకరణలకీ, మైనారిటీ ఓటు బ్యాంకులకూ, మత రాజకీయాలకూ నిలయమైన ఉత్తరప్రదేశ్ తీర్పు ఈసారి మార్పును సంతరించుకుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ముస్లింల నుంచి బీజేపీకి దక్కిన మద్దతు చరిత్రలో ఎప్పుడూ లేదు. ‘ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ పీఠానికి’ అన్న నినాదంతో సాగుతున్న బీఎస్పీ దళిత రాజకీయ అజెండాకు ఈ ఎన్నికలు గండి కొట్టాయి. బీజేపీని దరి చే రనీయని వర్గాలుగా పేర్గాంచిన మైనారిటీలూ, దళితులూ, ఓబీసీలూ దృక్పథాన్ని మార్చుకున్న సంగతి సుస్పష్టమైంది.
ఉత్తరప్రదేశ్లోని లక్నో, ఉనావ్, జాన్పూర్ వంటి లోక్సభ స్థానాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇందులో లక్నో స్థానం నుంచి గతంలో వాజపేయి గెలిచేవారు. ఆయన సంగతి వేరు. ఇప్పుడు సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ పోటీ చేసి గెలిచారు. యూపీలో బీజేపీ 73 లోక్సభ స్థానాలు గెలుచుకుని విశ్లేషకుల చేత నోరు వెళ్లబెట్టించింది. ఇందుకు ఉన్న అనేక కారణాలలో ఒకటి- బీజేపీకి ముస్లిం ఓటు.
కమలం పార్టీతో ముస్లింల వైరం జగద్విదితం. కానీ ఈ ఎన్నికలలో ఆ రాష్ట్రంలో పదిశాతం ముస్లింలు ఆ పార్టీ వైపు మొగ్గారు. ఈ రాష్ట్రంలోనే సంబాల్, రాంపూర్, షహరన్పూర్ వంటి నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. మెజారిటీ కాస్త తక్కువే అయినా ఈ నియోజక వర్గాలలో కూడా బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇది బీజేపీ మీద ఉన్న మత ముద్రను మాసిపోయేటట్టు చేయగలుగుతోందని సర్వే జరిపిన సీఎస్డీఎస్కు చెందిన ప్రొఫెసర్ అస్మెర్బేగ్ (అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం) వ్యాఖ్యానించారు. పైగా బీజేపీ వంటి పార్టీకి మైనారిటీ ఓటు పడేటట్టు చేసిన ఘనతను మళీ ్ల గోధ్రా అల్లర్లకు బాధ్యునిగా ప్రసిద్ధిగాంచిన నరేంద్ర మోడీకే ఇవ్వడం మరో విశేషం.
అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు అంటూ మోడీ ఇచ్చిన పిలుపునకు స్పందించి ముస్లిం యువత ఆయనకే ఓటు వేసిందని సర్వే చెబుతోంది. వీరంతా ఎన్నికల సమయంలో మోడీకి జైకొట్టకపోయినా, ఓటు వేశారని ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రముఖుడు ముఫ్తీ షామున్ ఖాస్మీ చేసిన వ్యాఖ్య నిజమనే అనిపిస్తుంది. సెక్యులర్ పార్టీలంటూ డబ్బా కొట్టుకునే ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలకు ఈ ఎన్నికలలో మైనారిటీలు ఝలక్ ఇచ్చారంటూ ఉత్తరప్రదేశ్ బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు రషీద్ అన్సారీ చెబుతున్న మాట వాస్తవమే.
కుల రాజకీయాలకు కూడా ఉత్తరప్రదేశ్ పెట్టింది పేరు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు ములాయం విజయ సూత్రం కుల, మత ప్రాతిపదికకు సంబంధించినదే. ఈ ఎన్నికలలో అక్కడ ఈ కుల సమీకరణలు కూడా చెల్లాచెదురైనాయి. దళితుల పార్టీ బీఎస్పీకి ఆది నుంచి అండదండలను ఇస్తున్న జాతవ్లు, సమాజ్వాదీ పార్టీకి విధేయులుగా ఉన్న యాదవులు ఈ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేశారు. అలాగే ఈ రెండు పార్టీలను నమ్ముకుని ఉన్న ఇతర దళిత వర్గాలు, ఓబీసీలు కూడా ఈసారి ఎదురు తిరిగారు. ఈ ధోరణి ఇలాగే రెండేళ్లు కనుక కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకుడు ఆదిత్య అవస్థి జోస్యం పలికారు. గత రెండు దశాబ్దాలుగా ఓబీసీ ఓట్లన్నీ ప్రాంతీయ పార్టీలకు పడుతున్నాయి. లేదా ‘సామాజిక న్యాయం’ నినాదం అందుకున్న పార్టీలకు వెళుతున్నాయి. నిజానికి ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ దేశ జనాభాలో 41 శాతం ఉన్నారు. ఈ వర్గమే బీజేపీని స్వాగతించింది. 2009లో 22 శాతం ఓబీసీ ఓట్లు బీజేపీకి రాగా, 2014 ఎన్నికలలో 34 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ ఘోర పరాజయానికి ఇదో ప్రధాన కారణం.
ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. దిగువ ఓబీసీలలో 42 శాతం, ఉన్నత ఓబీసీ వర్గం నుంచి 30 శాతం బీజేపీని ఆదరించారు. గుజరాత్, ఎంపీ, రాజస్థాన్, మహారాష్ట్రలో ఓబీసీలు మరో అభిప్రాయం లేకుండా బీజేపీకి ఓటు వేశారు. అయితే దేశమంతా ఇదే ధోరణి లేదు. ఇంతకీ ఇప్పుడు హిందూ ఓటు బ్యాంకు సుస్థిరమవుతున్నదా? లేక ప్రస్తుతం బీజేపీయే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలదన్న ఓటర్ల నమ్మకమా? అది భవిష్యత్తులో నిర్ణయమవుతుంది.
- కల్హణ
బద్దలైన యూపీ ఓటు బ్యాంకులు
Published Fri, Jun 6 2014 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement