ఏఓబీలో మరో ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు మృతి | Sakshi
Sakshi News home page

ఏఓబీలో మరో ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు మృతి

Published Fri, Dec 15 2017 10:48 AM

one Maoist killed in encounter in AOB area

విజయనగరం : తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం వద్ద జరిగిన ఎన్‌ కౌంటర్‌ ఘటన మరవక ముందే ఓవోబీలో మరో ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కటాఫ్ ఏరియాలో లుకాపాణి వద్ద మావోయిస్టులకు బీఎస్ఎఫ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతుడి వద్ద ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement