129వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

129వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Thu, Apr 5 2018 8:40 AM

129th Day PrajaSankalpaYatra Kick Starts - Sakshi

సాక్షి, గుంటూరు : ప్రజా సమస్యలు వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని వేజెండ్ల శివారు నుంచి గురువారం(129వ రోజు) పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి వడ్లమూడి చేరుకుని ప్రజలతో మమేకమవుతారు. అనంతరం పాలపూడి క్రాస్‌, గరువుపాలెంల మీదుగా శేకూరు క్రాస్‌ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. బాబూ జగజ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు వైఎస్‌ జగన్‌ పూలమాల వేసి నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించారు.

Advertisement
Advertisement