సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా జిల్లా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు రాజన్న బిడ్డతో కలిసి అడుగులేస్తున్నారు. ఈ సందర్భంగా 139వ రోజు పాదయాత్ర షెడ్యూల్ను విడుదలైంది. మైలవరం నుంచి వైఎస్ జగన్ బుధవారం పాదయాత్ర ప్రారంభిస్తారు. చిన్న నందిగామ క్రాస్, వెల్వదం, గణపవరం అడ్డా క్రాస్ మీదుగా గణపవరం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు.
భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి ప్రజలను సమస్యలను తెలసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగనున్నారు. అగిరిపల్లి క్రాస్ మీదుగా శోభనపురం క్రాస్ వరకు పాదయాత్ర సాగుతుంది. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ను మీడియాకు విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 138వరోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. మంగళవారం ఉదయం ముత్యాలంపాడు క్రాస్ నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం ఆత్కూరు, చెవుటూరు క్రాస్, కుంటముక్కల క్రాస్, గుర్రాజుపాలెం క్రాస్ మీదుగా మైలవరం చేరుకొని వైఎస్ జగన్ పాదయాత్రను ముగించారు. రాత్రికి ఆయన అక్కడే బసచేస్తారు. నేడు వైఎస్ జగన్ 15.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు వైఎస్ జగన్ 1794.2 కిలోమీటర్లు నడిచారు.