సాక్షి, కృష్ణా : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు చిన్న అగిరిపల్లి నుంచి సోమవారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్ జగన్ తోటపల్లి చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.
పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గొల్లన్నపల్లి, చిక్కవరం క్రాస్ల గోపవరపు గూడెంకు చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బసచేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ను ఆదివారం విడుదల చేశారు.