సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ఎజెండాగా, 2019 ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, ఇళ్లు, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని, ఈ కోణంలో లోతైన అధ్యయనం చేసి ఎన్నికల హామీలను తయారు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో 42 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో ఈ కమిటీ శుక్రవారం గాంధీభవన్లో భేటీ అయి రానున్న ఎన్నికలలో అనుసరించాల్సిన ‘సంక్షేమ’వ్యూహంపై చర్చించింది. సంక్షేమ పథకాల అమలు విషయంలో గత ప్రభుత్వాలకంటే ఎంతో మెరుగ్గా ఉండాలని, అందుకు అన్ని వర్గాల ప్రజలను పరిగణనలోకి తీసుకుని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఓ నివేదికను తయారుచేయాలని నిర్ణయించింది. వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, విద్యార్థులు, రోగులు, మహిళలు, నిరుద్యోగుల విషయంలో అమలు చేయాల్సిన పథకాలపై చర్చించిన కమిటీ, ఏప్రిల్ నెల మొదటివారంలో పార్టీకి తన నివేదికను అందించనుంది. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు హర్కర వేణుగోపాల్, నిరంజన్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2019 ఎన్నికలే టార్గెట్గా..
Published Sat, Mar 24 2018 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement