సాక్షి, అమరావతి: టీడీపీ మహానాడులో ఒక్క నాయకుడు కూడా నిజాలు చెప్పకుండా అబద్ధాలు ప్రచారం చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారే మహానాడులో ఆయన్ను పొగడటం విడ్డూరంగా ఉందన్నారు. యూ ట్యూబ్లో ఎన్టీఆర్ ఇంటర్వూను తిలకిస్తే చంద్రబాబు నిజ స్వరూపం ఏమిటో తెలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహానాడు నిర్వహిస్తారని చెప్పిన మరుక్షణమే అమెరికాలోని డల్లాస్లో తెలుగు వారు నల్ల చొక్కాలు ధరించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని గుర్తు చేశారు.
ప్యాకేజీ అద్భుతమని గత మహానాడులో తీర్మానం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అద్భుతంగా ఉందని గత ఏడాది మహానాడులో టీడీపీ తీర్మానం చేసిందని అంబటి తెలిపారు. ఇప్పుడు హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తూ చంద్రబాబు మోసగిస్తున్నారని మండిపడ్డారు. చెంచాలాగా వ్యవహరిస్తున్న జేసీ దివాకర్రెడ్డి లాంటి వాళ్లు అధికారం కోల్పోయాక చంద్రబాబును తిడతారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 25 ఎంపీ స్థానాలు కట్టబెడితే ప్రత్యేక హోదా సాధిస్తానని చంద్రబాబు పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 25 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజిస్తే బీజేపీ, టీడీపీలు సర్వనాశనం చేశాయన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని, మిగిలిన 2 శాతం హామీలు అమలు చేయకపోవడానికి ప్రతిపక్ష పార్టీ, ప్రధాని మోదీ కారణమని చంద్రబాబు ఆరోపించటం దారుణం అన్నారు.
మోత్కుపల్లికి జవాబిచ్చే ధైర్యం ఉందా?
చంద్రబాబునుద్దేశించి తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై ఒక్క దానికైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రధాని మోదీతో కలిసి తిరిగిన చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
మహానాడు వేదికగా అసత్య ప్రచారం
Published Thu, May 31 2018 3:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అడవిమామిడిపల్లిలో అగ్నిప్రమాదం
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
మంటలు అంటుకొని రైతు మృతి
బాధిత జర్నలిస్టుకు ఆర్థికసాయం
కడియం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement