సానుభూతిపరులు, పార్టీ నేతల నుంచే విరాళాలు | Sakshi
Sakshi News home page

సానుభూతిపరులు, పార్టీ నేతల నుంచే విరాళాలు

Published Mon, Feb 12 2018 2:47 AM

The BJP decision to receive donations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకు పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల నుంచే విరాళాలు స్వీకరించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో అవలంబించే నిధుల సేకరణ విధానాలు ‘రోజూవారీ’ కి పాటించకూడదని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలి పారు.

ఆదివారం పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ బలిదాన్‌ దివస్‌ (వర్ధంతి) సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సభ జరిగింది. లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. పార్టీ రోజూవారీ ఖర్చులకు నిధుల సేకరణ పారదర్శకంగా ఉండాలన్న నాయకత్వం ఆదేశించిందని చెప్పారు.

Advertisement
Advertisement