‘టీడీపీ రాజకీయాలను మార్కెట్‌ చేసింది’ | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 15 2018 2:45 PM

BJP Leader GVL Narasimha Rao Fires On TDP Leaders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ నేతలు రాజకీయ ఆరోపణలు చేసి ఐటీ సోదాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి 23మంది ఎమ్మెల్యేలను కొనగోలు చేసిందని ఆరోపించారు. రాజకీయాలను మార్కెట్‌గా మార్చారని మండిపడ్డారు. రాజకీయ పదవుల్లో ఉండి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. దేశమంతా ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఎవరిపైనా కక్ష సాధింపులు జరపడం లేదన్నారు. దేశంలో 2016-17లో 1152 ఐటీదాడులు, 2017-18లో 600 సోదాలు జరిగాయని గుర్తుచేశారు. టీడీపీ నేతలు ప్రగల్బాలు పలకకుండా ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జీవీఎల్‌ అన్నారు.

Advertisement
Advertisement