సాక్షి, అమరావతి: తనపై ఈనాడు దినపత్రిక రాసిన తప్పుడు వార్తలపై వివరణ ఇవ్వాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. తప్పును అంగీకరించకుండా తాను రామోజీరావుకు రాసిన బహిరంగ లేఖలో ప్రకటించినట్లుగా.. ‘ఆ మాట నేను అనలేదు’ అని వార్త ప్రచురించడంపై ఆయన మండిపడ్డారు. ‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’ అంటూ శనివారం ఆ పత్రికలో వచ్చిన కథనంపై ఆగ్రహం వ్యక్తంచేసిన బొత్స.. తన వివరణకూ అంతే ప్రాముఖ్యతనిస్తూ ప్రచురించాలని అదేరోజు రామోజీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం సంచికలో ఈనాడు స్పందించిన తీరుపై మంత్రి మరోసారి భగ్గుమన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఆయన శనివారం అన్న మాటల వీడియోను ప్రదర్శించారు.
వ్యక్తుల కోసం వ్యవస్థ నాశనం
ఈనాడు విలేకరులు, ఆ సంస్థ యాజమాన్యం వ్యక్తుల కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును రక్షించడానికి రామోజీరావు ఇలా చేయడం సరికాదన్నారు. తనను తాను మేధావిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు ఐటీ శాఖ ఇచ్చిన వివరాలను కూడా తప్పుబడుతున్నారని ఎద్దేవా చేశారు. యనమల ఎవరిపై పరువు నష్టం దావా వేస్తారని.. రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలపై బాబు ఆయన కుమారుడు లోకేష్లు ఎందుకు తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ఐటీ శాఖ చెబుతున్న మూడు కంపెనీలు టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్, లోకేష్ బినామీ కిలారు రాజేష్, వైఎస్సార్ కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలకు చెందిన కంపెనీలేనని బొత్స స్పష్టంచేశారు. కాగా, ఐదేళ్లలో ఒక లక్షా 95 వేల కోట్ల రూపాయల మేర చంద్రబాబు అప్పు చేశారని.. వాటితో ఎవరికైనా ఒక్క సంక్షేమ పథకంగానీ, ఒక్క ఇల్లుగానీ ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు.రామోజీరావు తన ఆఖరి దశలో ఇలాంటి ఆలోచనలు మార్చుకోవాలని బొత్స హితవు పలికారు.
తప్పుడు వార్తపై వివరణ ఇవ్వాల్సిందే
Published Mon, Feb 17 2020 3:55 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
Advertisement