లోకేశ్‌ సభలో అపశృతి | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ సభలో అపశృతి

Published Sat, Apr 6 2019 2:37 PM

Boy Injured With Current Shock In Nara Lokesh Election Campaign In Mangalagiri - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటుచేసకుంది. శనివారం లోకేశ్‌ దుగ్గిరాల మండలం చిలవురు గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. లోకేశ్‌ సభకు హాజరైన ఓ బాలుడి చేతిలోని టీడీపీ జెండా కరెంటు తీగలకు తగిలింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement