యశవంతపుర (బెంగళూరు): కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సోమవారం శాసనసభలో చర్చ జరుగుతుండగా, బీఎస్పీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్.మహేశ్ తన మొబైల్లో అమ్మాయిల ఫోటోలను వీక్షిస్తూ కెమెరాలకి చిక్కారు. సభ ప్రారంభానికి ముందు సభలోకి వచ్చి కూర్చున్న మహేశ్ స్మార్ట్ఫోన్లోని వాట్సాప్లో అమ్మాయిల ఫోటోలను చూడసాగారు. సభలో సభ్యులు మాట్లాడుతుండగా మహేశ్ ఫోన్లోనే నిమగ్నమయ్యారు. గతంలో బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మొబైల్ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తూ కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సభలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు.
ఫోన్ల వినియోగానికి ప్రత్యేక గదిని కేటాయించారు. నిషేధం ఉన్నప్పటికీ మహేశ్ సభలోకి ఫోన్ తీసుకురావడం వివాదాస్పదమైంది. అయితే, తన కొడుకుకు వధువును వెతికే ప్రయత్నాల్లో భాగంగా ఓ మిత్రుడి పంపిన అమ్మాయిల ఫొటోలను తాను అసెంబ్లీలో చూశానని, ఈ విషయంలో దురుద్దేశాలు ఆపాదించరాదని, ఆ ఫొటోలను టీవీల్లో చూపించి.. వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఎమ్మెల్యే మహేశ్ మీడియాను కోరారు.
Published Tue, Dec 18 2018 12:11 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
Advertisement