సాక్షి, అమరావతి: ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలకు, ప్రవర్తనకు పొంతన లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఓవైపు టీడీపీ 150 సీట్లు గెలుస్తుందని చెబుతూ, మరోపక్క ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి, ఉద్యోగులకు జీతాలు ఇప్పించే ప్రయత్నం చేయాలని సూచించారు. బుగ్గన శుక్రవారం హైదరాబాద్లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో
మాట్లాడారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
‘‘చంద్రబాబుకు అసహనం ఎక్కువైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని అనరాని మాటలు అనడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా సమీక్షలు నిర్వహించడం ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తారా? అత్యవసర పరిస్థితుల్లో తప్ప సమీక్షలు నిర్వహించకూడదన్న నిబంధనను చంద్రబాబు తుంగలో తొక్కాడు. పోలవరం ప్రాజెక్టు, సీఆర్డీఏపై సమీక్షలు చేపట్టాడు. హోంగార్డులకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు, డీఏలు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు స్కీమ్ల పేరిట ప్రభుత్వ నిధులను వాడుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్ రూపంలో చూపించారు. చంద్రబాబు మళ్లీ రాకపోతే అభివృద్ధి ఆగిపోతుందట! రాజధాని ప్రాం తంలో ఇప్పటికీ కంప చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
ట్యాంపరింగ్ ఎవరు చేశారు?
చంద్రబాబు సేవామిత్ర యాప్ పేరిట ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రోడ్డున పడేశాడు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోకుంటే ఎంతో అనర్థం జరిగేది. ఈవీఎంల ట్యాంపరింగ్ అని మాట్లాడుతున్నాడు. టీడీపీకి 150 సీట్లు వస్తున్నాయని చెబుతున్నాడు. మరి ట్యాంపరింగ్ ఎవరు చేశారు? చంద్రబాబు సాంకేతిక సలహాదారు వేమూరి హరిప్రసాద్ను, ‘ఆపరేషన్ గరుడ’యాక్టర్ శివాజీని అదుపులోకి తీసుకుని విచారించాలి ’’అని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు.
చంద్రబాబూ.. డ్రామాలు కట్టిపెట్టు
Published Sat, Apr 20 2019 12:38 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement