సాక్షి, అమరావతి : పోలింగ్ సరళిని బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాను జోరు ఉధృతంగా ఉన్నట్లు స్పష్టమవుతుండటంతో గెలుపు ఆశలు వదిలేసుకున్న టీడీపీ నేతలు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు 130 సీట్లు వస్తాయంటూ టీడీపీ నేతలు క్యాడర్కు సర్ది చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ తమకు మాత్రమే చేతనవుతుందని చెప్పుకునే పోల్ మేనేజ్మెంట్లో విఫలమవడం, చంద్రబాబు వ్యూహాలన్నీ అడ్డం తిరగడంతోపాటు వైఎస్ జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలనే నినాదం హోరుగాలిలా మారిన తీరు వారికి మింగుడుపడడం లేదు. కళ్లెదుటే ఓటమి సంకేతాలు స్పష్టంగా గోచరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక తీవ్రంగా మధనపడుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడ కలుసుకున్నా ఇవే అంశాలపై చర్చించుకుంటున్నారు. పరస్పరం ఫోన్లు చేసుకుంటూ తమ ఎమ్మెల్యే అభ్యర్థి పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ తప్పులు జరిగాయి? అనే వాటిపై విశ్లేషించుకుంటున్నారు. ఓటమి ఖాయమని తెలియడంతో పస లేని వాదనలను తెరపైకి తెచ్చి సర్ది చెప్పుకుంటున్నారు.
బాబు తీరుతో నేతల్లో నిస్పృహ
ఇప్పటికే టీడీపీ గెలుపుపై ఆశలు వదిలేసుకున్న ఆ పార్టీ క్యాడర్ చంద్రబాబు తీరుతో తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలపై అర్థంలేని ఆరోపణలతో రచ్చకెక్కడం ఓటమిని అంగీకరించినట్లేనని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తమ అధినేత అనవసరంగా ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేయడంతోపాటు మోదీ, జగన్, కేసీఆర్లకు ముడిపెట్టి అదేపనిగా ఆరోపణలు చేయడం వల్ల జనంలో మరింత పలుచనవుతున్నామని సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. ఫలితాల కోసం వేచి చూసి ఓటర్ల తీర్పును హుందాగా అంగీకరించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ తీరునే తప్పుబట్టడం, ఎన్నికలను ఒక ఫార్సుగా విమర్శించడం, ఎన్నికల కమిషన్ పనికిమాలినదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదనే భావన సాధారణ ప్రజల్లోనూ వ్యక్తమవుతోందని పార్టీ నేతలు వాపోతున్నారు. ఒకవైపు తామే గెలుస్తామని చెబుతూ, మరోవైపు ఎన్నికలు ఫార్సని విమర్శించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తరచూ ప్రజాస్వామ్య విలువల గురించి ప్రస్తావిస్తూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని తీవ్ర స్థాయిలో నిందించడం, ఈసీ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోవర్టుగా అభివర్ణించడం లాంటి చర్యల ద్వారా చంద్రబాబు పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నారనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది.
మేకపోతు గాంభీర్యం
Published Sun, Apr 14 2019 9:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement