సాక్షి, విశాఖపట్నం/ నందికొట్కూరు/ఆటోనగర్ (విజయవాడ తూర్పు): ఎన్నికల్లో ఖర్చు చేద్దామంటే తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తున్నారని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమవాళ్లు పది రూపాయలు ఖర్చు పెట్టాలని చూస్తుంటే ఐటీ అధికారులొచ్చి కార్యకర్తలకు ఐదు రూపాయలు కూడా ఖర్చుపెట్టనీయకుండా చేస్తున్నారని, అందుకే ఒకటే ఆలోచించి ప్రభుత్వ నిధులు ఇస్తున్నానని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శుభ్రంగా ఒక్క పైసా కూడా తాను ఇవ్వకుండా ప్రభుత్వపరంగా పింఛన్లకు రూ.2 వేలు ఇచ్చానని, రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు ఇచ్చానని, పసుపు–కుంకుమ కింద రూ.4 వేలు ఇచ్చానని, రైతులకు ఇవ్వాల్సిన రుణ బకాయిలు రూ.8 వేల కోట్లు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇన్ని వేల కోట్లు ఇస్తున్నప్పుడు.. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మీరు నాకు కాకుండా ఇంకెవరికి ఓట్లు వేస్తారు తమ్ముళ్లూ అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం విశాఖ నగర పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. ఎన్ఏడీ జంక్షన్లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల సమయంలో మాపై సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తారా? ఇది తెలుగుదేశంమీద దాడులు చేయడం కాదా? రాష్ట్రం మీద దాడులు చేయడం కాదా? నామీద దాడులు చేయడం కాదా? ఎన్నికల సమయంలో ఐటీ దాడులు చేయొచ్చునా? ఎక్కడైనా జరిగిందా? ఎవరిచ్చారు మీకీ అధికారం? అధికారముందని ఇష్టమొచ్చినట్టుగా దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులను నిర్వీర్యం చేస్తున్నారు. ఈడీ, ఇన్కంటాక్స్, సీబీఐలతో దాడులు చేస్తున్నారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు’’ అంటూ చంద్రబాబు వాపోయారు. అయితే సీబీఐ, ఐటీ దాడులకు తాము భయపడబోమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
మళ్లీ వస్తే విద్యార్థులకు ల్యాప్టాప్లు,కంప్యూటర్లు: టీడీపీకి మరోసారి అధికారం ఇస్తే వంశధార–నాగావళి నదులను అనుసంధానిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఇస్తామన్నారు. విశాఖ నుంచి కబ్జాకోరులను తరమికొట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం శుక్రవారం కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఆలూరు సభల్లోనూ ప్రసంగించారు. ఇదిలా ఉండగా, జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని రామవరప్పాడు వద్ద ఉన్న జగ్జీవన్రామ్ విగ్రహానికి సీఎం చంద్రబాబు శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఆక్షేపించారు.
అందుకే ప్రభుత్వ నిధులిస్తున్నా
Published Sat, Apr 6 2019 4:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement