సాక్షి ప్రతినిధి కడప: ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమ్మకద్రోహం చేశారు.. ఆయన ఏపీ అభివృద్ధికి సహకరించలేదు.. కియా మోటార్స్ను గుజరాత్కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే పోరాడి సాధించా’నని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేపట్టలేదని.. కట్టుబట్టలతో అమరావతికి వచ్చామని.. అండగా ఉంటారని భావించిన మోదీ ద్రోహం చేశారని.. మన ఆస్తుల్ని కేసీఆర్ స్వాహా చేశారని ఆరోపించారు. వైఎస్సార్జిల్లా జమ్మలమడుగు, పులివెందులలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టి వచ్చామని, అలాంటి హైదరాబాద్లను రాష్ట్రంలో నిర్మిస్తామని సీఎం చెప్పారు. గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ‘కృష్ణా’కు తీసుకొచ్చామని, అక్కడ నుంచి పులివెందులకు తీసుకొచ్చామని ఆయన వివరించారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. అక్రమార్కులను ప్రధాని మోదీ విదేశాలకు పంపిస్తే, తాను అగ్రిగోల్డ్ అక్రమార్కులను జైలుకు పంపించానన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో ఆడుకున్నారని.. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తేలేదని చెప్పారు.
హార్టికల్చర్ హబ్గా పులివెందుల
పులివెందులలో పండ్ల తోటలు అధికంగా ఉన్నందున ఐదేళ్లలో ఈ ప్రాంతాన్ని హార్టీకల్చర్ హబ్గా మారుస్తానని చంద్రబాబు ప్రకటించారు. కోల్డ్స్టోరేజీలు నిర్మించి, చైన్లింక్ ఏర్పాటుచేస్తామన్నారు. కాగా, హార్టికల్చర్ హబ్ విషయమై ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో.. ‘ఎన్నిసార్లు చెబుతావ్ సామీ’.. అంటూ కొందరు కేకలు వేశారు. పులివెందులలో సతీష్రెడ్డిని గెలిపిస్తే గండికోట ప్రాజెక్టులో 22 టీఎంసీలు నీరు నిల్వచేస్తామని, ఎంపీగా ఆదినారాయణరెడ్డిని గెలిపిస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇక్కడ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి లాగా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, వీరశివారెడ్డిలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చామని.. వారు కూడా గట్టిగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
ప్రధాని మోదీ నమ్మక ద్రోహి!
Published Tue, Apr 2 2019 5:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement