సాక్షి, అమరావతి: అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో చర్చ చేపట్టే అవకాశముందని.. ఇందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారం ఆయన టీడీపీ ఎంపీలు, ముఖ్య నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎంపీలంతా మంగళవారం లోక్సభకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. టీడీపీతో పాటు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం కూడా నోటీసులిచ్చాయని.. ఈ నేపథ్యంలో లాటరీ ద్వారా అవిశ్వాసంపై చర్చ చేపట్టే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో తొలుత నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసాన్ని చర్చకు చేపట్టవచ్చని.. ఏదేమైనా అవిశ్వాసంపై చర్చ జరిగితే సద్వినియోగం చేసుకోవాలన్నారు.
టీడీపీ ఎంపీలంతా పసుపు చొక్కాలు, కండువాలతో సభకు హాజరుకావాలని ఆదేశించారు. టీఆర్ఎస్ కూడా టీడీపీకి సహకరించేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. చర్చకు కావాల్సిన సమాచారం మొత్తం ఎంపీలకు అందుబాటులో ఉంచుతామని.. ఇందుకోసం రెండు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో ఒక బృందం, అమరావతి నుంచి మరో బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. యూసీలు(వినియోగపత్రాలు) ఇవ్వనందునే నిధులు విడుదల చేయలేదనే బీజేపీ ఆరోపణల్లో వాస్తవం లేదనే వాదనను గట్టిగా వినిపించాలని ఆదేశించారు.
అన్ని యూసీలు ఇచ్చినందునే కేంద్రం మలి విడత నిధులిచ్చిందంటూ బీజేపీ ఆరోపణలను ఖండించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అంశాలను ప్రచారం చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో బీజేపీ దుష్ప్రచారాన్ని అధికం చేసిందని.. దీనిపై ఎవరూ అధైర్యపడవద్దన్నారు. జాతీయ మీడియాను సమన్వయం చేసుకోవాలని, మన వద్దనున్న సమాచారం ఎప్పటికప్పుడు మీడియాకు ఇవ్వాలని సూచించారు.
అవిశ్వాసంపై చర్చకు సిద్ధంగా ఉండండి
Published Tue, Mar 27 2018 1:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement