సాక్షి, రాజమహేంద్రవరం: ‘నాలుగేళ్లు బీజేపీతో కలిసి పనిచేశాం. అడుగడుగునా అడ్డుపడ్డారు. ఏ మాత్రం సహకరించలేదు. భయపెడితే మేం భయపడే పరిస్థితుల్లో లేం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాదని చెప్పారు. నవనిర్మాణ దీక్షల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సంక్షేమం, సాధికారతపై నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘బీజేపీ గెలవదు. మేం చెప్పిన వారే ప్రధాని అవుతారు. మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పుతా. గుజరాత్ కంటే ఏపీ అభివృద్ధి సాధిస్తుందనే కేంద్రం సహకరించడం లేదు. బీజేపీ కుట్రలు చేస్తోంది. ఎన్నికల సమయంలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన ఏ హామీని కేంద్రం అమలు చేయలేదు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా ఇవ్వాలని 29 సార్లు ఢిల్లీ వెళ్లి అడిగినా పట్టించుకోలేదు. నేను మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశా’ అని సీఎం తెలిపారు.
కర్ణాటకలో అధికారం కోసం కుట్రలు
తాను ఇచ్చిన పిలుపు మేరకు కర్ణాటకలోని తెలుగువారు బీజేపీని ఓడించారని చంద్రబాబు పేర్కొన్నారు. కర్ణాటకలో అధికారం కోసం కుట్రలు చేశారని, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపించారు. మన రాష్ట్రంలో అలాంటి కుట్రలు సాగనివ్వబోమన్నారు. బీజేపీ, వైఎస్సార్ సీపీ కలసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. ఐదో బడ్జెట్ చూశాక కేంద్రం నుంచి, ఎన్డీఏ నుంచి తప్పుకుని అవిశ్వాసం పెట్టామని చెప్పారు. బీజేపీతో విడిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ తనపై, టీడీపీపై, పార్టీ ఎమ్మెల్యేలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
దేశంలో మనమే నంబర్ వన్
‘కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధికి నేను కష్టపడుతున్నా. దేశ ఆర్థికాభివృద్ధి కన్నా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఎక్కువ. 10.5 శాతం ఆర్థిక వృద్ధి, వ్యవసాయంలో 15 శాతం వృద్ధి సాధించాం. పారిశ్రామిక రంగం దెబ్బతింటోంది. అయినా కష్టపడి కొన్ని కంపెనీలు తెచ్చా. తిరుమల దేవాలయం పవిత్రతను మేం కాపాడుతున్నాం. అక్కడ ఓ పంతులును పట్టుకుని దేవాలయంపై కేంద్రం కుట్రలు చేస్తోంది. బీజేపీ, వైఎస్సార్ సీపీ, జనసేన కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం. ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కాపులకు ఇచ్చిన హామీని అమలు చేశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కిమిడి కళావెంకటరావు, నక్కా ఆనంద్బాబు, సుజయ్కృష్ణ రంగారావు, ఎంపీలు తోట నరసింహం, పి.రవీంద్రబాబు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
నీరు–ప్రగతిపై 52 శాతం మంది అసంతృప్తి
సాక్షి, అమరావతి: నీరు–ప్రగతి పనులపై ప్రజల్లో 48 శాతం సంతృప్తి వ్యక్తమైందని, 52 శాతం మందిలో అసంతృప్తి నెలకొదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం తన నివాసం నుంచి నవనిర్మాణ దీక్షపై సర్పంచులు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడుతూ ‘రైతు రథం, పొలం పిలుస్తోంది’పై 56 శాతం సంతృప్తి ఉందన్నారు. మూడో రోజు దీక్షలో 17 లక్షల మంది పాల్గొన్నారని, 19 వేల శంకుస్థాపనలు జరిగాయన్నారు.
చంద్రబాబు మృత్యుంజయ హోమం
అమలాపురం టౌన్: సీఎం చంద్రబాబు మంగళవారం అమలాపురం రూరల్ మండలం రంగాపురంలోని రాజరాజేశ్వరి సమేత రామేశ్వరస్వామి ఆలయంలో సకృత మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. చంద్రబాబు స్వయంగా హోమంలో పాల్గొని పూర్ణాహుతిలో ద్రవ్యాలను వేశారు. ఆలయ ప్రాంగణంలో కోనేరుకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. హోమం నిర్వహించిన 25 మంది వేద పండితులు చంద్రబాబును ఆశీర్వదించారు. చంద్రబాబు శివాలయంలో దాదాపు అరగంట పాటు ఉన్నారు. రాజయోగం, మృత్యుంజయం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం చేసే ఈ అరుదైన హోమాన్ని చంద్రబాబుతో చేయించాలన్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రయత్నం ఇన్నాళ్లకు ఫలించిందని పార్టీ నేతలు తెలిపారు.
బీజేపీకి భయపడం: బాబు
Published Wed, Jun 6 2018 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement