సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల కసరత్తు కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీని రద్దు చేసేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కీలకమైన మంత్రివర్గ సమావేశం ఎప్పుడు నిర్వహించాలనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. మాజీ మంత్రి హరికృష్ణ అకాల మరణం నేపథ్యంలో గురువారం మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం లేదు. మరోవైపు టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రగతి నివేదన సభ’ఆదివారం (2వ తేదీ) జరగనుంది. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఇతర మంత్రులు సభ ఏర్పాట్ల పరిశీలనలో నిమగ్నమై ఉంటారని, ఆ రోజు మంత్రివర్గ సమావేశం జరగకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ రోజు వీలుకాని పరిస్థితుల్లో ప్రగతి నివేదన సభ తర్వాతే మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే జరిగితే మంత్రివర్గ సమావేశం రెండుసార్లు కాకుండా ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది. అదే భేటీలో శాసనసభ సమావేశాల నిర్వహణ లేదా అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
అధికారిక నిర్ణయాల్లో వేగం
సీఎం కేసీఆర్ అధికారికంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి చేయాల్సిన అన్ని అధికారిక అంశాలు, హామీల అమలు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై పరిశీలిస్తున్నారు. బుధవారం సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. కీలకమైన బీసీ కులాలకు భవనాల నిర్మాణం కోసం నిధులను, స్థలాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇలాంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిధుల కేటాయింపుపై ఆర్థి క శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.
రేపా.. 2వ తేదీ తర్వాతా?
Published Thu, Aug 30 2018 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement