సాక్షి, విజయవాడ : వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన టీడీపీ నాయకుడు దేవినేని ఉమాహేశ్వరావుకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని గొల్లపూడి కరకట్ట వరదలతో ముంపుకు గురైన విషయం తెలిసిందే. దీంతో ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన దేవినేని ఉమకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయనను అక్కడి స్థానికులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించారు. దీంతో దేవినేని అనుచరులు నిలదీసిన స్థానికులను, మహిళలపై బెదిరించడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు.
టీడీపీ నేతల వరద రాజకీయాలు..
మరోవైపు వరద ముంపును రాజకీయం చేస్తున్న టీడీపీ నేతలపై వైఎస్సార్ సీపీ నేత బీవై రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్లుగా నిండని ప్రాజెక్టులు ఇప్పడు నీటితో నిండేసరికి కడుపు మండి టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకున్న వ్యక్తికి వరద వస్తుందని ముందుచూపు లేదా అంటూ ఎద్దేవా చేశారు. వరద తాకిడికి భయపడి చంద్రబాబు హైదరాబాదుకు పారిపోయారని, చిత్తశుద్ధి ఉంటే ఆయన తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. 2018లో టీడీపీ కార్యకర్తలు, కాంట్రాక్టర్లకు కోసం అన్న క్యాంటీన్ను ప్రారంభించిన చంద్రబాబు... ప్రజలకు, కార్మికులకు కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 75 రోజులలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి 80శాతం హామీలను అమలు చేశారని అన్నారు.
మహిళలపై దేవినేని అనుచరుల దౌర్జన్యం
Published Sat, Aug 17 2019 4:26 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
రోడ్డెక్కిన అన్నదాత
రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ
మద్యం వ్యాపారుల సిండికేట్ దందా
సివిల్స్ సాధించడమే లక్ష్యం
వైస్ ఎంపీపీ ఇంటిపై దాడికి యత్నం
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కాటన్ సేవలు చిరస్మరణీయం
ఏలేరులో అడుగంటిన నీటి నిల్వలు
విడాకులపై ట్రోల్స్.. అంత దిగజారిపోయారా? అన్న నటుడు
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement