సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేరికలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్న సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డికి గ్రీన్సిగ్న్ల్ ఇచ్చింది. అదేవిధంగా ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ తనయుడు సూర్య, వ్యాపారవేత్త ఆది శ్రీనివాస్ కూడా కాంగ్రెస్లో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాయలంలో రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో వీరు పార్టీలో చేరనున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి.. రాహుల్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ ఉద్యమాల్లో తన ఆట-పాటలతో, ధూమ్ధామ్లతో ఎంతో ఉత్తేజాన్ని కలిగించిన ప్రజాగాయకుడు గద్దర్. ఆయన తనయుడు సూర్య కాంగ్రెస్లో చేరడం కొత్త ఉత్సాహం నింపుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే, సీఎం కేసీఆర్పై విరుచుకుపడే నాగం జనార్దన్రెడ్డితోపాటు బీజేపీకి చెందిన మరో నాయకుడు ఆది శ్రీనివాస్కు కూడా కాంగ్రెస్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్లో చేరనున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ బీజేపీకి గుడ్బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, పార్టీలో తన పదవికి ఆయన రాజీనామా చేశారు.
Published Tue, Apr 24 2018 6:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement