టీడీపీది డొంక తిరుగుడు వ్యవహారం: గడికోట | Sakshi
Sakshi News home page

టీడీపీది డొంక తిరుగుడు వ్యవహారం: గడికోట

Published Fri, Mar 16 2018 8:51 PM

Gadikota Srikanth Reddy Criticises Chandrababu On Special Status - Sakshi

సాక్షి, కడప: ప్రత్యేక హోదా అంశం నేడు దేశవ్యాప్తంగా చర్చకు రావడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలే కారణమని ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హోదా పేరెత్తితే ముగిసిన అధ్యాయమని, జైల్లో వెయ్యాలంటూ హుంకరించిన ఏపీ సీఎం చంద్రబాబు నేడు అవన్నీ మరచి వైఎస్ జగన్ దారిలోకి వచ్చాడన్నారు. రాయచోటిలోని వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిన్న వైఎస్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తానని చంద్రబాబు చెప్పారు. కానీ నేడు మేమివ్వం, మేమే అవిశ్వాసం పెడతానని కొత్త రాగం ఎందుకు అందుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. 

వైఎస్ఆర్‌సీపీ చిత్తశుద్ధి చూసి దేశంలోని పార్టీలన్నీ ఒకతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా విషయంలో సహకరిస్తున్నాయి. కానీ ఇలాంటి కీలక సమయంలో టీడీపీ మాత్రం డొంక తిరుగుడుగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఏడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. హోదా ఎవరు ఇస్తే వారితోనే మా పొత్తు ఉంటుందని ముందు నుంచి వైఎస్ఆర్‌సీపీ చెబుతోందని గుర్తు చేశారు. బీజేపీ హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇప్పుడు బల్లగుద్ది చెబుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకొనే ప్రశ్నే లేదని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement