విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటే చంద్రబాబు మాత్రం ఎన్నికలంటేనే బెంబేలెత్తిపోతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటమి భయంతో టీడీపీ తీవ్ర ఒత్తిడిలో ఉందని, చంద్రబాబుకు ఈసారి అధికారం మూడు నాళ్ల ముచ్చటే అని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతిలో కనీసం శాశ్వత భవనం కట్టలేకపోయారని, సెక్రటేరియట్ నిర్మించలేని చంద్రబాబు ఒలంపిక్స్ నిర్వహిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది..మంత్రులు, ఎమ్మెల్యేలను చూసి అధికారులు కూడా అవినీతిపరులుగా మారారని అన్నారు.
అవినీతికి చట్టబద్ధత తెచ్చిన ఘనుడు చంద్రబాబేనని వెల్లడించారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని వాళ్లలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చెయ్యడమే అవుతోందన్నారు. సీఎం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే స్పీకర్ చూస్తూ ఉన్నారని, కచ్చితంగా ఈ సమావేశాల్లో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ప్రభుత్వమేనన్నారు. ఏపీ ఫిషరీష్ ద్వారా వేల కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారు..వాటి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
చంద్రబాబు అప్పు చెయ్యటంలో నెంబర్ వన్ అని నిరూపించుకున్నారని..అప్పుల్లో కూడా అవినీతి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. హెరిటేజ్ భూములు మాత్రం అమరావతి నిర్మాణంలో పోకుండా చేశారనే అపవాదు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫండ్ కోసం అమరావతిని బాబు వాడుకుంటున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడిన వారి పేర్లు త్వరలోనే బయటపెడతామని చెప్పారు. ప్రజల మధ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు దళారీలుగా ఉన్నారని, ప్రతి నియోజకవర్గంలో కాంట్రాక్టు పనుల కోసం టీడీపీ ఎమ్మెల్యేలకు 10 శాతం వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏపీలో ఉందని అన్నారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ రాజకీయ బాధితుడిగా మారాడని వ్యాఖ్యానించారు.
Published Thu, Sep 6 2018 1:23 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
తప్పక చదవండి
- మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
Advertisement