బాబు.. ఈ ధర్మపోరాట సభలు వేస్ట్‌: జేసీ | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 25 2018 5:52 PM

JC Diwakar Reddy Sensational Comments on Chandrababu Naidu - Sakshi

సాక్షి, కర్నూలు : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సొంతపార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తాడని తనకు నమ్మకం లేదన్నారు. తనకు పదవులపై ఆకాంక్షలేదని, ఈ ధర్మపోరాట సభలన్నీ వేస్ట్‌ అని గతంలో చెప్పానని, ఇప్పుడూ చెబుతున్నానని తెలిపారు. కొన్ని సందర్భాల్లో వేదిక మీద ఉన్న నేతలు చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారని బాంబు పేల్చారు. కేంద్రం చేసిన ద్రోహం గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, అసలు ఈ దీక్షల వల్ల ప్రయోజనమే లేదని అభిప్రాయపడ్డారు.

కేంద్రంపై ఎన్ని పోరాటాలు చేసినా దున్నపోతుపై వర్షం కురిసినట్టేనన్నారు. చిల్లి చిప్పతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాబు.. చేతికి ఎముక లేదన్నట్లు సంక్షేమ కార్యక్రమాలు చేబడుతున్నారని, పథకాలతో లబ్ది పొందిన ప్రజలు మరిచిపోతారని చెప్పారు. ఇవ్వన్నిటి కంటే అందరికి నీరిస్తే సరిపోతుందని సూచించారు. రాష్ట్ర ప్రజలు మహాత్మ గాంధీ, కాటన్‌ దొరను, చంద్రబాబు మరిచిపోలేరని తన ప్రసంగాన్ని ముగించారు. జేసీ వ్యాఖ్యలకు సభపై ఉన్న నేతలు, సీఎం చంద్రబాబు అవాక్కయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement