సహనం కోల్పోయి అవిశ్వాసం: జీవన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

సహనం కోల్పోయి అవిశ్వాసం: జీవన్‌రెడ్డి

Published Fri, Nov 3 2017 2:19 AM

jeevan reddy commeted over congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ వాళ్లు సహనం కోల్పోయి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని అంటున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కేవలం 13 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం అంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని దీమా వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement