Sakshi News home page

ఎందుకు అమలు చేయరు?

Published Sat, Mar 10 2018 2:43 AM

Jeevan reddy on ST reservation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజనులకు రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలోనే అమలు చేసే అవకాశమున్నా సీఎం కేసీఆర్‌ ఎందుకు అమలు చేయడం లేదని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల్లో హామీలిచ్చిన టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదని ఆరోపించారు. కేంద్రంలో గిరిజనులకు 7.5 శాతం రిజర్వేషన్లుండగా.. రాష్ట్రంలో 6 శాతమే అమలవుతున్నాయని చెప్పారు. గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.  

Advertisement
Advertisement