టీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి: జీవన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి: జీవన్‌రెడ్డి

Published Wed, Feb 28 2018 2:20 AM

jeevan redy commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు ద్రోహం చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీని బొందపెట్టాలని శాసనసభ పక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు నిజమైన ద్రోహులు టీఆర్‌ఎస్‌ ఎంపీలేనన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలన్న టీఆర్‌ఎస్‌ ఎంపీల డిమాండ్‌ ఆ పార్టీ నేతలకు వినసొంపుగా ఉందని, అదే కాంగ్రెస్‌ ఎంపీ జైరాంరమేశ్‌ అంటే మాత్రం అది తెలంగాణ ద్రోహంగా కనపడుతోందని ఎద్దేవా చేశారు. తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నోరెత్తలేని వారే నిజమైన ద్రోహులన్నారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను తీసుకువస్తే పునర్విభజన చట్టంలో హామీలను కూడా ఎందుకు సాధించలేకపోయిందని ప్రశ్నించారు.  

Advertisement
Advertisement