సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు ఉండగానే రాజకీయ సమీకరణలు వేగం పుంజుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకను బీజేపీ చేతుల్లోకి పోకుండా చూసుకోవాలని అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేసిన తీరును చూసి కచ్చితంగా తాము విజయం సాధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ మునుపటికంటే మెరుగ్గా పనితనం చూపిస్తుండటంతోపాటు అధికారంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుండంతో రాహుల్ కొత్త అవతారం తమకు తిరిగి కర్ణాటకలో అధికారం కట్టబెడుతుందని అక్కడి కాంగ్రెస్ పెద్దలు అనుకుంటున్నారు.
ముఖ్యంగా బీజేపీ పట్టుకున్న మత కార్డును తామే ముందుగా వాడుకొని బీజేపీ కంటే వేగంగా విజయంవైపు దూసుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ టిప్పు సుల్తాన్ జయంతివంటి వాటిని విమర్శిస్తుండటంతోపాటు హిందూ, ముస్లిం పేరిట కాంగ్రెస్పై దాడులు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అదే స్థాయి విమర్శలను ఎక్కుపెట్టాలనుకుంటోంది. కొంతమంది సీనియర్ నేతల అభిప్రాయం ప్రకారం రాహుల్ గాంధీని తమ రాష్ట్రంలో ముఖ్యమైన ఓ డజను ఆలయాలు సందర్శింపజేసి, శక్తిమంతమైన మతాచార్యులతో భేటీ అయ్యేలా చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో చేస్తున్న రాజకీయాలను దెబ్బకొట్టొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.
ఓ టాప్ నాయకుడు ఓ మీడియాతో మాట్లాడుతూ ‘నిజమైన హిందుత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే జాతీయవాద పార్టీ. బీజేపీ మాదగ్గర నుంచి అది హైజాక్ చేసి మమ్మల్ని హిందూవ్యతిరేకులుగా ముద్ర వేస్తోంది. బీజేపీ వేసిన ఆ ఉచ్చులో మా వాళ్లు కూడా పడ్డారు. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో ఆ తప్పును సరిదిద్దుకుంటున్నాం. కాంగ్రెస్లో చాలా మంది నేతలు హిందువులే. మా ప్రధానులు, ముఖ్యమంత్రులు 90శాతం హిందువులే. అలాంటిది మమ్మల్ని ఎలా హిందూ వ్యతిరేకులు అని అంటారు. రాహుల్ గాంధీ ఓ సాధారణ హిందువుగా ఉండటంలేదు.. ఒక నిజమైన హిందువు ఏం చేయాలో అవన్నీ రాహుల్ చేస్తున్నారు. గుజరాత్లో బీజేపీ హిందు వర్సెస్ ముస్లిం రాజకీయాల్లో విఫలమైంది. కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం కాదని ప్రజలకు అర్ధమైంది. వాళ్లు రాహుల్పై పేల్చిన తుటా తిరిగి వారివైపే పేలింది. కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది’ అని ఆ వ్యక్తి అన్నారు.
బీజేపీని కర్ణాటకలో దెబ్బకొట్టే కాంగ్రెస్ వ్యూహమిదే..!
Published Mon, Dec 25 2017 7:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement