యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా కేశవ్‌ చంద్‌ | Sakshi
Sakshi News home page

యూత్‌ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడిగా కేశవ్‌ చంద్‌

Published Fri, May 11 2018 8:21 PM

Keshav Chand Yadav Elected Youth congress National President - Sakshi

సాక్షి, ఢిల్లీ :  యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేశవ్‌చంద్‌ యాదవ్‌ ఎంపికయ్యారు. అలాగే తెలంగాణకు చెందిన బీవీ శ్రీనివాస్‌ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం అమరీందర్‌ సింగ్‌ రాజా స్థానంలో కేశవ్‌ చంద్‌ను నియమించారు. ఈ మేరకు జనరల్‌ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీకి అమరీందర్‌ సింగ్‌ అందించిన సేవలను ప్రశంసించింది.

Advertisement
Advertisement