గుడివాడ రూరల్: చంద్రబాబుకు సిగ్గు, శరం ఉంటే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన కుమారులకు వదిలేసి, దమ్ము, ధైర్యం ఉంటే తనయుడు లోకేష్తో సీబీఎన్ టీడీపీని స్థాపించి 2024 ఎన్నికలకు రావాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సవాల్ విసిరారు. స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద శనివారం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడని, ఆయన పార్టీ పెట్టి ప్రజల మధ్యకు వెళ్తే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని, ఆ తర్వాత రికార్డు స్థాయిలో 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారన్నారు. జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని చవట దద్దమ్మ నారా లోకేష్కు లేదని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
► 2014లో అధికారంలోకి వచ్చే ముందు పూర్తిగా మారిపోయానని, రూ.87వేల కోట్ల రైతు రుణాలు రద్దు చేస్తానని, హైటెక్ నుండి రైతు పక్షపాతినయ్యానంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా మోసం చేసిన వెన్నుపోటుదారుడిగా చంద్రబాబునాయుడు మిగిలిపోయారు.
► రైతుల రుణాలను కేవలం రూ.12వేల కోట్లను మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్న చవట దద్దమ్మ. అన్నం పెట్టే రైతును మోసం చేయగల్గిన చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారతాడని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.
► గత ఎన్నికలకు ముందు రైతులకు రూ.12,500లు చొప్పున నాలుగేళ్ల పాటు రైతు భరోసాగా ఇస్తానని జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. తర్వాత దాన్ని రూ.13,500 పెంచి ఇస్తూ వస్తున్నాం. ఎక్కడా రైతులను మోసం చేసే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదు.
► లాక్డౌన్ కాలంలో 20 కేజీలు తగ్గానని మహానాడులో లోకేష్ చెప్పుకున్నాడు. పిజ్జాలు, బర్గర్లు, ఐస్క్రీంలు లేక తగ్గినట్టు ఉన్నాడు.
► ఎన్ని అడ్డంకులు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగు ముందుకే పడుతుంది. వెనక్కి వేయించగల దమ్ము, ధైర్యం ఉన్న శక్తులు, వ్యక్తులు రాష్ట్రంలో ఎవరూ లేరు. ఒక కోర్టులో అన్యాయం జరిగితే పైకోర్టుకు వెళ్లడం సర్వ సాధారణం. మేమూ అదే చేస్తాం.
సిగ్గుంటే టీడీపీని వదిలేయాలి
Published Sun, May 31 2020 4:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement