దోచుకొని తెలంగాణను ఖాళీ చేశారు | Sakshi
Sakshi News home page

దోచుకొని తెలంగాణను ఖాళీ చేశారు

Published Sat, Mar 17 2018 3:08 AM

komati reddy venkata reddy commented over kcr - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాలుగేళ్ల కాలంలో తెలంగాణను దోచుకొని మొత్తం ఖాళీ చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్లీనరీలో పాల్గొనేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రజలను కులాల వారీగా విడదీస్తూ కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు తీసుకొచ్చి తెలంగాణను దివాలా తీసేలా చేశారన్నారు. అప్రజాస్వామిక రీతిలో తమపై వేటు చేశారని, దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబాన్ని జైల్లో పెట్టడమే తన లక్ష్యమని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement