డబ్బులతో ఏపీ పోలీసులు దొరికారు: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 4:32 PM

KTR Slams AP Cm Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో కోట్ల రూపాయలు పంచేందుకు చంద్రబాబు తెరతీశారన్నారు. ధర్మపురిలో తమ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా.. కొందరు డబ్బులతో దొరికారని, తీరా వారు ఏపీ పోలీసులని తెలిసిందని స్పష్టం చేశారు. ఏపీ పోలీసులు తెలంగాణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం ఏపీ ఇంటలిజెన్స్‌ను చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. 
 

Advertisement
Advertisement